Curd : ప్రతి రోజూ పెరుగును తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. పెరుగు వలన అనేక లాభాలని మనం పొందడానికి వీలవుతుంది. పెరుగును తీసుకుంటే రకరకాల సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు. ముఖ్యంగా పెరుగు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలను తగ్గిస్తుంది. శరీర ఉష్ణోగ్రతని అదుపులో ఉంచుకోవడానికి, వేసవికాలంలో చల్లని ఆహారం తినాలని ఆరోగ్య నిపుణులు అంటూ ఉంటారు. అయితే పెరుగును తీసుకోవడం వలన శరీరం చల్లగా మారుతుంది.
హైడ్రేటెడ్ గా శరీరం ఉంటుంది. పైగా పెరుగును తీసుకోవడం వలన చాలా సమస్యలు పోతాయి. పెరుగుని కొంచెం చక్కెరలో వేసుకుని తీసుకోవచ్చు. ఉప్పు, మిరియాలు, జీలకర్ర పొడి లేదంటే కూరగాయలతో అయినా తీసుకోవచ్చు. సహజంగా గుండె ఆరోగ్యాన్ని పెరుగు పెంపొందిస్తుంది. పెరుగులో తేనె కలిపి తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. శక్తివంతమైన ఔషధంలా ఇది పనిచేస్తుంది.
ప్రోటీన్స్, క్యాల్షియం పెరుగులో ఎక్కువగా ఉంటాయి. శరీరంలో విటమిన్ డి స్థాయిని పెంచడానికి కూడా పెరుగు సహాయం చేస్తుంది. పెరుగును తీసుకుంటే విటమిన్ డి ని పెంచుకోవచ్చు. ధమనుల్లో అడ్డంకిని పెరుగు తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పెరుగు, తేనె తీసుకోవడం వలన ఫైటో కెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.
ఫ్రీ ర్యాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని కూడా పెరుగు తొలగించగలదు. రక్తపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పెరుగుని మనం అన్నంతో పాటు తీసుకోవచ్చు. లేదంటే పెరుగుతో చాలా రకాల వంటకాలని కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు. పెరుగు కొలెస్ట్రాల్ ని ఏర్పడకుండా నిరోధిస్తుంది. అధిక రక్తపోటు కూడా కంట్రోల్ లో ఉంటుంది. క్రమం తప్పకుండా పెరుగును తీసుకుంటే, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు, అధిక రక్తపోటు ప్రమాదం తగ్గుతాయి. గుండె జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…