High BP : నేటి తరుణంలో మనలో చాలా మందిని భాదిస్తున్న అనారోగ్య సమస్యల్లో బీపీ ఒకటి. దీనిని సైలెంట్ కిల్లర్ గా చెబుతూ ఉంటారు. ఎటువంటి బాధ లేకుండా మనిషి ప్రాణం పోవడానికి దారి తీస్తుంది ఈ బీపీ. బీపీ కారణంగా మూత్రపిండాలు వైఫల్యం చెందుతాయి. గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. మెదడు ఆరోగ్యం దెబ్బతింటుంది. పక్షవాతం రావడానికి కూడా ప్రధాన కారణం ఈ బీపీయే. అయితే చాలా మందిలో వారికి బీపీ ఉన్నట్టుగానే తెలియడం లేదు. ఎటువంటి లక్షణాలు, సమస్యలు తలెత్తకపోయే సరికి చాలా మంది వారికి బీపీ లేదు అని భావిస్తున్నారు. ఈ సమస్య మరింత తీవ్రమయ్యి తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడిన తరువాతనే చాలా మంది బీపీకి సంబంధించిన పరీక్షలు చేయించుకుంటున్నారు. అనారోగ్య సమస్యల బారిన పడడాని కంటే ముందుగానే మనం తరచూ బీపీ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.
ఒక్కసారి ఈ సమస్య బారిన పడితే జీవితాంతం మందులు వాడాల్సిందే. కనుక బీపీ ఉన్నది తెలియగానే వెంటనే మందులు వాడకుండా సహజ సిద్దంగా కూడా ఈ బీపీని మనం అదుపులోకి తెచ్చుకోవచ్చు. మొదటి దశ ( 129 – 89) హైబీపీతో బాధపడే వారు మందులు వాడే అవసరం లేకుండా సహజ సిద్దంగా రెండు నెలల్లోనే బీపీ సాధారణ స్థాయికి వచ్చేలా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. మొదటి దశ హైబీపీతో బాధపడే వారు యాలకుల పొడిని వాడడం వల్ల సహజంగా బీపీని తగ్గించుకోవచ్చని నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేసారు. రోజూ ఉదయం 3 గ్రాములు, అలాగే సాయంత్రం 3 గ్రాముల యాలకుల పొడిని ఇచ్చి 20 మందిపై రెండు నెలల పాటు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందని వారు చెబుతున్నారు. అలాగే అధిక రక్తపోటు అదుపులో లేని వారు కూడా ఈ యాలకుల పొడిని వాడడం వల్ల రక్తపోటు అదుపులోకి వస్తుందని వారు చెబుతున్నారు. పూటకు మూడు గ్రాముల మోతాదులో రెండు పూటలా యాలకుల పొడిని వాడడం వల్ల మందులు వాడే అవసరం లేకుండా అధిక రక్తపోటు చాలా సులభంగా అదుపులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా ఈ యాలకుల పొడిని వాడడం వల్ల శరీరంలో యాంటీ ఆక్సిండెంట్లు 90 శాతం వరకు పెరిగాయని నిపుణులు ఈ పరిశోధనల ద్వారా వెల్లడించారు. యాంటీ ఆక్సిడెంట్లు పెరగడం వల్ల మనం అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని మలినాలు, విష పదార్థాలు తొలగిపోతాయి. అయితే అధిక రక్తపోటు సమస్య చాలా భయంకరమైనదని బీపీ రీడింగ్ ఎల్లప్పుడూ 110-80 లోపు ఉండేలా జాగ్రత్తపడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధంగా యాలకుల పొడిని రెండు పూటలా వాడడం వల్ల మొదటి దశలో బీపీ ఉన్న వారు మందులు వడకుండానే బీపీని తగ్గించుకోవచ్చు. అలాగే యాలకుల పొడిని వాడడం వల్ల అదుపు తప్పిన బీపీ క్రమంగా అదుపులోకి వస్తుందని, దీనిని ఉపయోగించడం వల్ల బీపీ లేని వారికి బీపీ రాకుండా ఉంటుందని వారు చెబుతున్నారు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…