Sudden Death : పుట్టిన ప్రతి ఒక్కరు మరణించక తప్పదు అని మనకు తెలసిందే. మరణం సహజమే అయినప్పటికి కొందకు అనారోగ్యాల కారణంగా చనిపోతూ ఉంటారు. ఇలా చనిపోయే వారికి ముందుగానే మనం మరణిస్తాము అని తెలిసిపోతుంది. కానీ కొందరు ఆత్మహత్యా చేసుకుని చనిపోతారు అలాగే కొందరు రోడ్డు ప్రమాదాల వల్ల, గుండె పోటు వల్ల ఇలా వివిధ రకాలుగా వారికి తెలియకుండానే ఆకస్మాత్తుగా మరణిస్తారు. అయితే ఇలా ఆకస్మాత్తుగా అలాగే ఆత్మహత్యా చేసుకుని మరణించిన తరువాత వారి ఆత్మ ఏమవుతుందని మనలో చాలా మంది సందేహ పడుతూ ఉంటారు. మన జాతక చక్రంలో అష్టమ భాగం పాడవడం వల్ల అలాగే కుజుడు, రాహు,శని గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల అకాల మరణం సంభవిస్తుందని పండితులు చెబుతున్నారు.
మన జాతక చక్రాన్ని చూసి ముందుగానే మనకు అకాల మరణం ఉంటుందని ముందుగానే చెప్పవచ్చని వారు చెబుతున్నారు. సహజంగా లేదా ఆకస్మాత్తుగా ఎలా మరణించినా కూడా మరణించిన వెంటనే ఆత్మను యమ భటులు పైకి తీసుకెళ్తారని వారి పాపపుణ్యాలను బట్టి యమలోకానికి లేదా విష్ణు సన్నిదికి తీసుకెళ్లి మళ్లీ వెంటనే ఆత్మను కిందికి తీసుకోస్తారని పండితులు చెబుతున్నారు. మరణించిన వారి ఆత్మ పెద్ద కర్మ జరిగే వరకు ఇంటి వద్దే ఉంటుందని అందరిని గమనిస్తూ ఉంటుందని వారు చెబుతున్నారు.
అయితే ఆత్మహత్యా చేసుకుని మరణించిన వారి ఆత్మ పిశాచిలా మారి ఎప్పుడూ నిప్పుకనికలా మండుతూ ఉంటుందని ఆత్మకు ప్రతిక్షణం నరకం కనిపిస్తూ ఉంటుదని పండితులు చెబుతున్నారు. ఆత్మహత్యా చేసుకుని మరణించిన వారి జాతక చక్రంలో సూర్యుడు బలంగా ఉంటే ఆత్మ ఇతరుల శరీరంలోకి ప్రవేశించలేదని సూర్యుడు బలహీనంగా ఉంటే ఆత్మ వేరే వారి శరీరంలోకి ప్రవేశిస్తుందని వారు తెలియజేస్తున్నారు. ఆత్మహత్యా చేసుకుని అస్సలు మరణించకూడదని చనిపోయిన తరువాత మన ఆత్మ చాలా నరకం చూడాల్సి వస్తుందని వారు చెబుతున్నారు. అలాగే మరణించిన తరువాత మన ఆత్మ మన అరచేయంత పరిమాణం అవుతుందని గరుడ పురాణంలో దీని గురించి స్పష్టంగా తెలియజేయబడిందని పండితులు చెబుతున్నారు.
అదే విధంగా కొన్ని పరిహారాలను చేయడం వల్ల మనకు ఆకస్మిక మరణం సంభవించకుండా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఆలయాలకు వెళ్లి కుజుడు, రాహు, శని గ్రహాలకు దీపం వెలిగించాలి. కందులు, మినుములు, తెల్ల నువ్వులను దానంగా ఇవ్వాలి. తరచూ రోడ్డు ప్రమాదాలకు గురి అయ్యే వారు ఈ పరిహారాన్ని పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అదే విధంగా ఆత్యహత్యా చేసుకోకుండా ఉండాలంటే చంద్ర కేతువులకు దానం ఇవ్వాలి. ఉలవలు, బియ్యాన్ని దానంగా ఇవ్వాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…