సాధారణంగా మన శరీరానికి అవసరమయ్యే పోషకాలను అందించే వాటిలో మన పేగులు ఒకటి. ఇవి శక్తిని గ్రహించడంతో పాటు, మానసిక సమతుల్యతను కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మన పేగులలో మన ఆరోగ్యాన్ని కాపాడే మంచి బ్యాక్టీరియాలు ఉంటాయి. దీని ద్వారా మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి దోహదపడతాయి.అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది వారి జీవనశైలిలో ఎన్నో మార్పులను చోటు చేసుకున్నారు. ఈ క్రమంలోనే సరేనా పోషకాహారానికి బదులుగా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడటంతో శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందింప చేసే బ్యాక్టీరియాలు నశించిపోయి తరచూ తీవ్రమైన కడుపు నొప్పి సమస్యతో బాధపడుతుంటారు. అయితే ఈ విధంగా కడుపు నొప్పి రావడానికి మనం చేసే కొన్ని తప్పులు కూడా కారణమవుతాయి మరి ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
*సాధారణంగా ప్రతి రోజూ వారి ఆహారంలో భాగంగా ఎక్కువ మోతాదులో చక్కెర తీసుకుంటారు. అధిక మోతాదులో చక్కెర తీసుకోవటంవల్ల మన ప్రేగులలో ఉండే బ్యాక్టీరియా పూర్తిగా దెబ్బతింటుంది తద్వారా తరచూ మనకు కడుపునొప్పి రావడం మొదలవుతుంది.
*మన శరీరానికి కావల్సినంత నిద్ర లేకపోవడం వల్ల అధిక ఒత్తిడి ఆందోళనకు గురి కావడం వల్ల గట్ బ్యాక్టీరియా పూర్తిగా దెబ్బతింటుంది.
*మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావాలంటే తప్పనిసరిగా నీటిని తీసుకోవాలి. అయితే చాలామంది నీటి పరిమాణం పూర్తిగా తగ్గించడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
*మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ లోపించడం వల్ల కూడా ఈ విధమైనటువంటి సమస్య తలెత్తుతుంది. ఫైబర్ కలిగిన ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణాశయంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా తీసుకున్న ఆహారం సరైన క్రమంలో జీర్ణమవుతుంది.
*అధికంగా మద్యపానం చేయడం వల్ల దాని ప్రభావం గట్ బ్యాక్టీరియాలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఈ కారణం చేత మన శరీరానికి మంచి చేసే బ్యాక్టీరియాకు తీవ్రమైన హాని కలుగుతుంది.
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…