Sleeping : ఈ రోజుల్లో చాలా మంది రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోతున్నారు. రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం వలన అనేక సమస్యలు కలుగుతుంటాయి. పైగా ఎనిమిది గంటల కంటే ఎక్కువ సేపు నిద్రపోతే పలు సమస్యలు వస్తాయి. ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుంది. మనిషి సగటున ఏడు నుండి ఎనిమిది గంటల పాటు రోజూ నిద్రపోవాలి. అయితే కొందరు ఏం చేస్తారంటే ఎనిమిది గంటలకంటే ఎక్కువ సేపు నిద్రపోతూ ఉంటారు. అలాంటప్పుడు కొన్ని ప్రమాదాలు కలుగుతూ ఉంటాయి.
ఎనిమిది గంటలకంటే ఎక్కువ సేపు నిద్రపోవడం వలన శరీర బరువు పెరిగిపోతుంది. దీంతో మీరు అధిక బరువు సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. బాగా ఎక్కువ సేపు నిద్రపోతే గుండె జబ్బులు కూడా ఎక్కువ అవుతాయి. ఎక్కువసేపు నిద్రపోతే వేగంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుందని స్టడీ చెప్తోంది. కాబట్టి అతిగా అసలు నిద్రపోకండి.
ఎక్కువసేపు నిద్రపోవడం వలన మెదడు సామర్ధ్యం బాగా తగ్గిపోతుంది. జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంది. ఎనిమిది గంటలకంటే ఎక్కువగా నిద్రపోవడం వలన తలనొప్పి కూడా వస్తుంది. ఎనిమిది గంటలకంటే ఎక్కువ నిద్రపోవడం వలన నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. మధుమేహం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అంతసేపు నిద్రపోకండి.
అంతేకాకుండా ఎనిమిది గంటలకంటే ఎక్కువ సేపు నిద్రపోవడం వలన ఒత్తిడి బాగా పెరుగుతుంది. మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అశాంతి వంటి ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి నిద్ర విషయంలో కచ్చితంగా ఈ నియమాలని పాటించండి. మరీ ఎక్కువ సేపు, మరీ తక్కువ సేపు కాకుండా ఎనిమిది గంటల పాటు నిద్రపోండి. అంతకు మించి నిద్రపోతే ఈ సమస్యలు తప్పవు. కాబట్టి అసలు ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోండి. మంచి నిద్ర ఉంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఒత్తిడి వంటి బాధలు కూడా ఉండవు. ప్రశాంతంగా ఉండొచ్చు. రోజూ ఒకే టైంకి నిద్ర పోయి, ఒకే టైంకి నిద్ర లేస్తే ఆరోగ్యం బాగుంటుంది.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…