Sesame Seeds : ఆరోగ్యానికి నువ్వులు ఎంతో మేలు చేస్తాయి. నువ్వులను తీసుకోవడం వలన, అనేక లాభాలు ఉంటాయి. 100 గ్రాములు నువ్వులలో, 1450 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. పెద్దలైతే రోజు కి, 450 మిల్లీ గ్రాముల క్యాల్షియం తీసుకోవాలి. పిల్లలు 600 మిల్లీ గ్రాములు, గర్భిణీలు 900 మిల్లీ గ్రాముల క్యాల్షియం తీసుకోవాలి. ఒక గ్లాసు పాలల్లో 150 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. కాలుష్యం పొందడానికి, నువ్వులు మంచివి. నువ్వులను తింటే, వేడి చేస్తుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ, నిజానికి ఒంట్లో వాటర్ శాతం తగ్గితేనే, వేడి చేస్తుంది.
ప్రతి ఒక్కరు కూడా, రోజుకి నాలుగు ఐదు లీటర్లు నీళ్లు తాగాలి. నువ్వులను తీసుకోవడం వలన గర్భం పోతుందని కూడా అంటూ ఉంటారు. అలానే, నువ్వులు తినడం వలన ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయని నమ్ముతారు. కానీ నిజానికి నువ్వులు తింటే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారట. నువ్వులను వేయించి పొడి కింద చేసుకుని, కూరల్లో వేసుకోవచ్చు. నువ్వులను నానబెట్టి బాగా నానిన తర్వాత, నోట్లో వేసుకొని నమిలి తింటే కూడా మంచిదే.
మిక్సీ లో వేసి వచ్చిన పాలని తాగితే కూడా క్యాల్షియం బాగా అందుతుంది. పూర్వకాలం లో ఎక్కువగా నువ్వుల్ని వాడేవారు. బారసాల వంటి వాటిలో, నువ్వులని ఉండలు కింద చేసి, ప్రసాదంగా పెట్టేవారు. నువ్వులను వాడితే, ఎన్నో రకాల లాభాలు ఉంటాయి. ముఖ్యంగా కాల్షియం అంది, ఎముకల సమస్యలు వంటి వాటికి దూరంగా ఉండవచ్చు.
గుండెపోటు, చర్మ సమస్యలు కూడా నువ్వుల్ని తీసుకోవడం వలన రావు. పైల్స్, మలబద్ధకం సమస్యలు కూడా తగ్గుతాయి. చూశారు కదా, నువ్వుల వల్ల ఉపయోగాలు. మరి నువ్వులను రెగ్యులర్ గా తీసుకుని, ఇటువంటి సమస్యలన్నిటికీ కూడా దూరంగా ఉండండి. ఏ సమస్య లేకుండా ఆరోగ్యంగా ఉండండి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…