Sesame Seeds : ఆరోగ్యానికి నువ్వులు ఎంతో మేలు చేస్తాయి. నువ్వులను తీసుకోవడం వలన, అనేక లాభాలు ఉంటాయి. 100 గ్రాములు నువ్వులలో, 1450 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. పెద్దలైతే రోజు కి, 450 మిల్లీ గ్రాముల క్యాల్షియం తీసుకోవాలి. పిల్లలు 600 మిల్లీ గ్రాములు, గర్భిణీలు 900 మిల్లీ గ్రాముల క్యాల్షియం తీసుకోవాలి. ఒక గ్లాసు పాలల్లో 150 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. కాలుష్యం పొందడానికి, నువ్వులు మంచివి. నువ్వులను తింటే, వేడి చేస్తుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ, నిజానికి ఒంట్లో వాటర్ శాతం తగ్గితేనే, వేడి చేస్తుంది.
ప్రతి ఒక్కరు కూడా, రోజుకి నాలుగు ఐదు లీటర్లు నీళ్లు తాగాలి. నువ్వులను తీసుకోవడం వలన గర్భం పోతుందని కూడా అంటూ ఉంటారు. అలానే, నువ్వులు తినడం వలన ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయని నమ్ముతారు. కానీ నిజానికి నువ్వులు తింటే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారట. నువ్వులను వేయించి పొడి కింద చేసుకుని, కూరల్లో వేసుకోవచ్చు. నువ్వులను నానబెట్టి బాగా నానిన తర్వాత, నోట్లో వేసుకొని నమిలి తింటే కూడా మంచిదే.
మిక్సీ లో వేసి వచ్చిన పాలని తాగితే కూడా క్యాల్షియం బాగా అందుతుంది. పూర్వకాలం లో ఎక్కువగా నువ్వుల్ని వాడేవారు. బారసాల వంటి వాటిలో, నువ్వులని ఉండలు కింద చేసి, ప్రసాదంగా పెట్టేవారు. నువ్వులను వాడితే, ఎన్నో రకాల లాభాలు ఉంటాయి. ముఖ్యంగా కాల్షియం అంది, ఎముకల సమస్యలు వంటి వాటికి దూరంగా ఉండవచ్చు.
గుండెపోటు, చర్మ సమస్యలు కూడా నువ్వుల్ని తీసుకోవడం వలన రావు. పైల్స్, మలబద్ధకం సమస్యలు కూడా తగ్గుతాయి. చూశారు కదా, నువ్వుల వల్ల ఉపయోగాలు. మరి నువ్వులను రెగ్యులర్ గా తీసుకుని, ఇటువంటి సమస్యలన్నిటికీ కూడా దూరంగా ఉండండి. ఏ సమస్య లేకుండా ఆరోగ్యంగా ఉండండి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…