కోవిడ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో టీకాల పంపిణీ కార్యక్రమం చురుగ్గా కొనసాగుతోంది. అనేక చోట్ల పెద్ద ఎత్తున టీకాలను వేస్తున్నారు. దేశంలో ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వి టీకాలు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల ప్రజలకు వాటినే వేస్తున్నారు. అయితే కోవిడ్ టీకాలను తీసుకునేందుకు వెళ్తున్నవారు ఈ 10 విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. అవేమిటంటే..
1. దేశంలోని ప్రజలు తమకు నచ్చిన టీకాను వేసుకునే వెసులు బాటు ఉంది. పైన తెలిపిన మూడు టీకాల్లో తమకు నచ్చిన టీకాను వేసుకోవచ్చు. కాకపోతే ఏ కేంద్రంలో ఏ టీకాను వేస్తున్నారో ముందుగానే తెలుసుకోవాలి. తరువాత యాప్లో రిజిస్టర్ చేసుకుని కేంద్రానికి వెళ్లాలి. టీకాను తీసుకోవాలి. మొదటి డోసు తీసుకున్నాక టీకా రకాన్ని బట్టి నిర్దిష్టమైన తేదీలోగా రెండో డోసును వేసుకోవాలి.
2. కోవిడ్ టీకా ఏ కంపెనీది తీసుకున్నా మొదటి, రెండు డోసులు ఒకే టీకా వేసుకోవాలి. రెండు వేర్వేరు టీకాలను తీసుకోరాదు.
3. కోవిడ్ నుంచి కోలుకున్న వారు 84 రోజుల పాటు ఆగాకే టీకా వేసుకోవాలి. కోవిడ్ నుంచి కోలుకుంటే ఏ వ్యాక్సిన్ వేసుకున్నా ఒక్క డోసు తీసుకుంటే చాలు. రక్షణ లభిస్తుంది.
4. గర్భిణీలు కూడా టీకాలను తీసుకోవచ్చు. వారి పిల్లలు సురక్షితంగానే ఉంటారు.
5. టీకాను తీసుకున్న తరువాత కొందరికి టీకా వేసుకున్న చేతికి నొప్పిగా అనిపిస్తుంది. తరువాత జ్వరం, ఒళ్లు నొప్పులు వస్తాయి. 2 రోజుల పాటు ఉన్నాక ఆయా సమస్యలు తగ్గిపోతాయి. లక్షణాలు లేనంత మాత్రాన టీకా పనిచేయడం లేదని అనుకోరాదు. లక్షణాలు ఉన్నా, రాకున్నా టీకాలు పనిచేస్తాయి.
6. కోవిడ్ టీకా తీసుకున్న తరువాత వారం రోజుల వరకు మద్యం సేవించరాదు. అలా అని చెప్పి దీన్ని ఎవరూ ధ్రువీకరించలేదు. కానీ వైద్యులు మాత్రం సూచిస్తున్నారు.
7. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు కోవిడ్ టీకాను తీసుకున్న తరువాత యథావిధిగా తమ మెడిసిన్లను వాడుకోవచ్చు. వాటిని ఆపేయాల్సిన పనిలేదు.
8. కోవిడ్ టీకాలను ప్రస్తుతం 18 ఏళ్లకు పైబడిన వారికే వస్తున్నారు. పలు కంపెనీలు చిన్నారుల కోసం ప్రత్యేకమైన టీకాలను రూపొందిస్తున్నాయి. వాటికి గాను ట్రయల్స్ ను నిర్వహిస్తున్నారు. అందువల్ల మరో 6 నెలల్లో వారికి కూడా టీకాలు అందుబాటులోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
9. కోవిడ్ టీకాలను తీసుకున్న తరువాత పోషకాహారం తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని మరింత పెంచుకోవచ్చు.
10. టీకా తీసుకున్న తరువాత కేంద్రంలోనే 30 నిమిషాల పాటు వేచి ఉండాలి. ఎందుకంటే అనుకోకుండా ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే వెంటనే చికిత్సను అందించేందుకు వీలు కలుగుతుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…