Jaggery : చెరుకు నుంచి తయారు చేసే బెల్లం అంటే చాలా మందికి ఇష్టమే. దీన్ని వంటల్లో వేస్తుంటారు. దీంతో స్వీట్లు కూడా తయారు చేస్తుంటారు. బెల్లం ఎంతో రుచిగా ఉంటుంది. దీంతో చేసే స్వీట్లను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఇక షుగర్ ఉన్నవారు బెల్లాన్ని నిర్భయంగా వాడుకోవచ్చని వైద్య నిపుణులు కూడా సూచిస్తుంటారు. అయితే వాస్తవానికి బెల్లంతో ఒక అద్భుతమైన ఉపయోగం ఉంది. అదేమిటో తెలిస్తే మీరు ఎగిరి గంతేస్తారు. ఈ క్రమంలోనే రోజూ రాత్రి భోజనం తరువాత చిన్న బెల్లం ముక్కను తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లంలో మెగ్నిషియం పుష్కలంగా లభిస్తుంది. ఇది మనస్సుకు ప్రశాంతతను అందిస్తుంది. దీంతో టెన్షన్, ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. రోజంతా టెన్షన్లతో గడిపేవారు రాత్రి భోజనం అనంతరం చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకోవాలి. దీంతో ఒక్కసారిగా రిలాక్స్ అవుతారు. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించి రాత్రి పూట చక్కగా నిద్రిస్తారు. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో రక్తం బాగా తయారవుతుంది. అలాగే బెల్లంలో ట్రిప్టోఫాన్ అనబడే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది సెరటోనిన్ స్థాయిలను పెంచుతుంది. దీంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. చక్కని మూడ్లోకి వస్తారు. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.
ఇలా రాత్రి పూట బెల్లం తినడం వల్ల గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలో లేపినా లేవరు. అంత చక్కగా నిద్ర పడుతుంది. ఇంతటి అద్భుతమైన ఉపయోగం ఉంది కనుక బెల్లాన్ని రోజూ తినాలి. అయితే షుగర్ ఉన్నవారు వైద్యుల సలహా మేరకు దీన్ని తీసుకోవడం ఉత్తమం. ఇక బరువు తగ్గాలనుకునే వారు కూడా బెల్లాన్ని తక్కువ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా బెల్లాన్ని రాత్రి పూట తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…