Jaggery : చెరుకు నుంచి తయారు చేసే బెల్లం అంటే చాలా మందికి ఇష్టమే. దీన్ని వంటల్లో వేస్తుంటారు. దీంతో స్వీట్లు కూడా తయారు చేస్తుంటారు. బెల్లం ఎంతో రుచిగా ఉంటుంది. దీంతో చేసే స్వీట్లను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఇక షుగర్ ఉన్నవారు బెల్లాన్ని నిర్భయంగా వాడుకోవచ్చని వైద్య నిపుణులు కూడా సూచిస్తుంటారు. అయితే వాస్తవానికి బెల్లంతో ఒక అద్భుతమైన ఉపయోగం ఉంది. అదేమిటో తెలిస్తే మీరు ఎగిరి గంతేస్తారు. ఈ క్రమంలోనే రోజూ రాత్రి భోజనం తరువాత చిన్న బెల్లం ముక్కను తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లంలో మెగ్నిషియం పుష్కలంగా లభిస్తుంది. ఇది మనస్సుకు ప్రశాంతతను అందిస్తుంది. దీంతో టెన్షన్, ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. రోజంతా టెన్షన్లతో గడిపేవారు రాత్రి భోజనం అనంతరం చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకోవాలి. దీంతో ఒక్కసారిగా రిలాక్స్ అవుతారు. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించి రాత్రి పూట చక్కగా నిద్రిస్తారు. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో రక్తం బాగా తయారవుతుంది. అలాగే బెల్లంలో ట్రిప్టోఫాన్ అనబడే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది సెరటోనిన్ స్థాయిలను పెంచుతుంది. దీంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. చక్కని మూడ్లోకి వస్తారు. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.
ఇలా రాత్రి పూట బెల్లం తినడం వల్ల గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలో లేపినా లేవరు. అంత చక్కగా నిద్ర పడుతుంది. ఇంతటి అద్భుతమైన ఉపయోగం ఉంది కనుక బెల్లాన్ని రోజూ తినాలి. అయితే షుగర్ ఉన్నవారు వైద్యుల సలహా మేరకు దీన్ని తీసుకోవడం ఉత్తమం. ఇక బరువు తగ్గాలనుకునే వారు కూడా బెల్లాన్ని తక్కువ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా బెల్లాన్ని రాత్రి పూట తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…