Intermittent Fasting : మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే అధిక బరువు సమస్య బారిన పడడానికి ప్రధాన కారణాలని చెప్పవచ్చు. అలాగే అధిక బరువు వల్ల మనం వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన కూడా పడాల్సి వస్తుంది. గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణం అధిక బరువే అని చెప్పవచ్చు. కనుక అధిక బరువు సమస్య నుండి వీలైనంత త్వరగా బయటపడడం చాలా అవసరం. మనలో చాలా మంది బరువు తగ్గడానికి రకరకాల పద్దతులు పాటిస్తూ ఉంటారు. అయితే కొందరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికి బరువు తగ్గరు.
ఇలాంటి వారు ఇంటర్మీటెంట్ పాస్టింగ్ పద్దతిని పాటించడం వల్ల చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ పద్దతిలో రోజుకు రెండు సార్లు మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. ఈ పద్దతిని మన పూర్వీకులు ఎప్పుడో పాటించారు. కష్టపడి పని చేసే వారు రోజుకు మూడు సార్లు ఆహారాన్ని తీసుకునే వారు. అదే నీడపట్టున కూర్చుని పని చేసే వారు రోజుకు రెండు సార్లు మాత్రమే ఆహారాన్ని తీసుకునే వారు. ఇలా తీసుకోవడం వల్లనే వారు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎంతో కాలం జీవించారు. ఈ పద్దతినే మనం ఇప్పుడు ఆచరించాలి. ఈ ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ లో రోజుకు రెండు సార్లు ఆహారాన్ని తీసుకుని 16 గంటలు ఎటువంటి ఘన పదార్థాలను తీసుకోకుండా ఉండాలి.
ఉదయం 10 గంటలకు ఏదైనా ఒక వెజిటేబుల్ జ్యూస్ ను తీసుకోవాలి. ఇలా తీసుకున్న గంట తరువాత రెండు లేదా మూడు పుల్కాలను కూరలతో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తరువాత మరలా సాయంత్రం 4 గంటలకు ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ ను తీసుకోవాలి. అలాగే 5 గంటలకు మొలకెత్తిన విత్తనాలను తీసుకోవాలి. తరువాత 7 గంటల లోపు వివిధ రకాల పండ్లను తీసుకోవాలి. మరింత శక్తి కావాలనుకునే వారు పచ్చి కొబ్బరిని, నానబెట్టిన పల్లీలను, డ్రై ఫ్రూట్స్ ను కూడా తీసుకోవచ్చు. సాయంత్రం 7 గంటల లోపు ఈ విధంగా ఆహారాన్ని తీసుకున్న తరువాత మరలా ఉదయం 11 గంటల వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు.
ఈవిధంగా ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ ను పాటించడం వల్ల రెండు నెలల్లోనే మనం 5 నుండి 10 కిలోల వరకు బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ పద్దతిని పాటించడం వల్ల అధిక బరువు సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. ఆరోగ్యవంతంగా బరువు తగ్గవచ్చు. ఈ పద్దతిని పాటించడం వల్ల బరువు తగ్గడంతో పాటు శరీరానికి కావల్సిన పోషకాలు కూడా అందుతాయి. అలాగే షుగర్, థైరాయిడ్, ఆర్థరైటిస్ వంటి సమస్యలు అదుపులోకి వస్తాయి. అధిక బరువుతో బాధపడే వారు ఈ ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ పద్దతిని పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…