Intermittent Fasting : మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే అధిక బరువు సమస్య బారిన పడడానికి ప్రధాన కారణాలని చెప్పవచ్చు. అలాగే అధిక బరువు వల్ల మనం వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన కూడా పడాల్సి వస్తుంది. గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణం అధిక బరువే అని చెప్పవచ్చు. కనుక అధిక బరువు సమస్య నుండి వీలైనంత త్వరగా బయటపడడం చాలా అవసరం. మనలో చాలా మంది బరువు తగ్గడానికి రకరకాల పద్దతులు పాటిస్తూ ఉంటారు. అయితే కొందరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికి బరువు తగ్గరు.
ఇలాంటి వారు ఇంటర్మీటెంట్ పాస్టింగ్ పద్దతిని పాటించడం వల్ల చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ పద్దతిలో రోజుకు రెండు సార్లు మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. ఈ పద్దతిని మన పూర్వీకులు ఎప్పుడో పాటించారు. కష్టపడి పని చేసే వారు రోజుకు మూడు సార్లు ఆహారాన్ని తీసుకునే వారు. అదే నీడపట్టున కూర్చుని పని చేసే వారు రోజుకు రెండు సార్లు మాత్రమే ఆహారాన్ని తీసుకునే వారు. ఇలా తీసుకోవడం వల్లనే వారు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎంతో కాలం జీవించారు. ఈ పద్దతినే మనం ఇప్పుడు ఆచరించాలి. ఈ ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ లో రోజుకు రెండు సార్లు ఆహారాన్ని తీసుకుని 16 గంటలు ఎటువంటి ఘన పదార్థాలను తీసుకోకుండా ఉండాలి.
ఉదయం 10 గంటలకు ఏదైనా ఒక వెజిటేబుల్ జ్యూస్ ను తీసుకోవాలి. ఇలా తీసుకున్న గంట తరువాత రెండు లేదా మూడు పుల్కాలను కూరలతో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తరువాత మరలా సాయంత్రం 4 గంటలకు ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ ను తీసుకోవాలి. అలాగే 5 గంటలకు మొలకెత్తిన విత్తనాలను తీసుకోవాలి. తరువాత 7 గంటల లోపు వివిధ రకాల పండ్లను తీసుకోవాలి. మరింత శక్తి కావాలనుకునే వారు పచ్చి కొబ్బరిని, నానబెట్టిన పల్లీలను, డ్రై ఫ్రూట్స్ ను కూడా తీసుకోవచ్చు. సాయంత్రం 7 గంటల లోపు ఈ విధంగా ఆహారాన్ని తీసుకున్న తరువాత మరలా ఉదయం 11 గంటల వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు.
ఈవిధంగా ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ ను పాటించడం వల్ల రెండు నెలల్లోనే మనం 5 నుండి 10 కిలోల వరకు బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ పద్దతిని పాటించడం వల్ల అధిక బరువు సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. ఆరోగ్యవంతంగా బరువు తగ్గవచ్చు. ఈ పద్దతిని పాటించడం వల్ల బరువు తగ్గడంతో పాటు శరీరానికి కావల్సిన పోషకాలు కూడా అందుతాయి. అలాగే షుగర్, థైరాయిడ్, ఆర్థరైటిస్ వంటి సమస్యలు అదుపులోకి వస్తాయి. అధిక బరువుతో బాధపడే వారు ఈ ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ పద్దతిని పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…