ఆరోగ్యం

Diabetes : ఈ చిట్కాల‌తో షుగ‌ర్ 500 ఉన్నా స‌రే దిగొస్తుంది..!

Diabetes : ప్రస్తుత కాలంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల్లో షుగ‌ర్ వ్యాధి కూడా ఒక‌టి. షుగ‌ర్ వ్యాధితో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. ఈ వ్యాధి అదుపులో లేక చాలా మందిలో మూత్ర‌పిండాలు వైఫల్యం చెందుతున్నాయి. కంటి చూపు త‌గ్గుతుంది. పురుషుల్లో లైంగిక సామ‌ర్థ్యం త‌గ్గుతుంది. అరిచేతులు, అరికాళ్ల‌ల్లో మంట‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. దెబ్బ‌లు, గాయాలు త‌గ్గ‌క ఇబ్బంది ప‌డుతున్నారు.శ‌రీరంలో ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ స‌న్న‌గిల్లుతుంది. నీర‌సం, బ‌ల‌హీన‌త వంటి వాటితో బాధ‌ప‌డుతున్నారు. అలాగే దంతాల స‌మ‌స్య‌లు, గుండె జ‌బ్బులు వంటి వాటి బారిన ప‌డుతున్నారు. చాప కింద నీరు వ‌లె ఈ షుగ‌ర్ వ్యాధి శ‌రీర‌నంత‌టిని నాశ‌నం చేస్తుంది. క‌నుక ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం.

షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు ముచ్చ‌టగా మూడు సూత్రాల‌ను పాటించ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా ఈ వ్యాధి అదుపులోకి వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు ముందుగా తెల్ల‌టి బియ్యంతో వండిన అన్నాన్ని తిన‌డం మానేయాలి. బియ్యాన్ని పాలిష్ ప‌ట్ట‌డం వ‌ల్ల పై రెండు పొర‌ల్లో ఉండే పోష‌కాల‌న్నీ త‌వుడులోకి వెళ్లిపోతున్నాయి. మిగిలిన తెల్ల‌బియ్యంలో కేవ‌లం కార్బోహైడ్రేట్స్ మాత్ర‌మే ఉంటాయి. అత్య‌ధిక కార్బోహైడ్రేట్స్ ఉండే ధాన్యాల్లో బియ్యం ఒక‌టి. బియ్యంలో 77 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అన్నాన్ని ఎంత ఎక్కువ‌గా తింటే షుగ‌ర్ వ్యాధి వ‌చ్చే అవ‌కాశాలు అంత ఎక్కువ‌గా ఉంటాయి.

Diabetes

అలాగే అన్నాన్ని తిన‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి పెరుగుతుంది. క‌నుక షుగ‌ర్ వ్యాధి అదుపులోకి రావాల‌నుకునే వారు అన్నాన్ని తిన‌డం మానేయాలి. పుల్కాల‌ను, జొన్న రొట్టెల‌ను మాత్ర‌మే తినాలి. మ‌ధ్యాహ్నం పుల్కాల‌ను, రాత్రి జొన్న రొట్టెల‌ను ఎక్కువ కూర‌ల‌తో ఆహారంగా తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం తీసుకునే కార్బోహైడ్రేట్ ల శాతం త‌గ్గుతుంది. అలాగే కూర‌ల్లో ఉప్పు లేకుండా తీసుకోవాలి. ఉప్పు త‌క్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి అదుపులోకి వ‌స్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే రెండ‌వ‌ది… షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు ఉద‌యం పూట ఇడ్లీ, దోశ‌, ఉప్మా వంటి అల్పాహారాల‌ను తీసుకోకూడ‌దు. మొల‌కెత్తిన విత్త‌నాల‌ను మాత్ర‌మే తీసుకోవాలి. రోజూ ఉద‌యం 3 ర‌కాల గింజ‌ల‌ను మొల‌కెత్తించి తీసుకోవాలి.

అలాగే వీటితో పాటు పండ్ల‌ను తీసుకోవాలి. ఇక చివ‌రిది రోజూ ఉద‌యం చెమ‌ట ప‌ట్టేలా వ్యాయామం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు త‌గ్గుతాయి. ఇన్సులిన్ నిరోధ‌క‌త త‌గ్గుతుంది. అలాగే రాత్రి భోజ‌నం చేసిన త‌రువాత ఒక గంట పాటు వాకింగ్ చేయాలి. ఇలా మూడు నియ‌మాల‌ను పాటిస్తూ రోజుకు మూడు సార్లు మాత్ర‌మే ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి త‌గ్గు ముఖం ప‌డుతుంది. త‌ర‌చూ ర‌క్త‌ప‌రీక్ష‌లు చేయించుకుంటూ వైద్యున్ని సంప్ర‌దించి మందుల మోతాదును త‌గ్గించుకుంటూ ఉండాలి. ఈ విధంగా షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు ఈ నియ‌మాల‌ను పాటించ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా షుగ‌ర్ వ్యాధిని త‌గ్గించుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

అల్లు అర్జున్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం.. ‘వాల్ ఆఫ్ గ్రేట్స్’పై మొదలైన వివాదం!

హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…

Saturday, 14 March 2026, 5:49 PM

‘కాక్‌టెయిల్ 2’ రిలీజ్ డేట్ ఖరారు.. రష్మిక-షాహిద్-కృతి ఫస్ట్ లుక్ చూశారా?

ర‌ష్మిక మంద‌న్న‌, షాహిద్ కపూర్‌, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…

Saturday, 14 March 2026, 11:53 AM

వివాదాస్పద రనౌట్.. బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ మ్యాచ్‌లో హైడ్రామా! ‘క్రికెట్ స్ఫూర్తి’ ఎక్కడ?

పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…

Friday, 13 March 2026, 8:27 PM

సినిమాలకు సెన్సార్ బోర్డు కొత్త రూల్.. ఇక సబ్‌టైటిల్స్ తప్పనిసరి! మార్చి 15 నుంచి అమల్లోకి..

సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…

Friday, 13 March 2026, 5:41 PM

‘పిల్లలకు ఊపిరాడటం లేదు’.. ముంబై కాలుష్యంపై దీపికా పదుకొనె ఆందోళన! అధికారులకు ప్రశ్న.

ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…

Friday, 13 March 2026, 11:45 AM

28 రోజుల రీచార్జ్ ప్లాన్‌ పేరుతో దోపిడీ.. పార్లమెంట్‌లో రాఘవ్ చద్దా ఫైర్!

రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…

Thursday, 12 March 2026, 7:33 PM

తాప్సీ ఫైర్.. స్టార్ల స్టాఫ్‌పై నిర్మాతల ఆరోపణల్లో నిజం లేదు!

చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్‌కు వ‌స్తార‌ని, దీంతో వారికి చేసే ఖ‌ర్చు గ‌ణ‌నీయంగా…

Thursday, 12 March 2026, 4:59 PM

ఐపీఎల్ 2026పై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ శుక్లా.. ఆ వార్తల్లో నిజం లేదు!

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…

Thursday, 12 March 2026, 3:06 PM