Diabetes : ప్రస్తుత కాలంలో మనలో చాలా మందిని వేధిస్తున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల్లో షుగర్ వ్యాధి కూడా ఒకటి. షుగర్ వ్యాధితో మనలో చాలా మంది బాధపడుతున్నారు. ఈ వ్యాధి అదుపులో లేక చాలా మందిలో మూత్రపిండాలు వైఫల్యం చెందుతున్నాయి. కంటి చూపు తగ్గుతుంది. పురుషుల్లో లైంగిక సామర్థ్యం తగ్గుతుంది. అరిచేతులు, అరికాళ్లల్లో మంటలతో బాధపడుతున్నారు. దెబ్బలు, గాయాలు తగ్గక ఇబ్బంది పడుతున్నారు.శరీరంలో రక్షణ వ్యవస్థ సన్నగిల్లుతుంది. నీరసం, బలహీనత వంటి వాటితో బాధపడుతున్నారు. అలాగే దంతాల సమస్యలు, గుండె జబ్బులు వంటి వాటి బారిన పడుతున్నారు. చాప కింద నీరు వలె ఈ షుగర్ వ్యాధి శరీరనంతటిని నాశనం చేస్తుంది. కనుక ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం.
షుగర్ వ్యాధితో బాధపడే వారు ముచ్చటగా మూడు సూత్రాలను పాటించడం వల్ల చాలా సులభంగా ఈ వ్యాధి అదుపులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. షుగర్ వ్యాధితో బాధపడే వారు ముందుగా తెల్లటి బియ్యంతో వండిన అన్నాన్ని తినడం మానేయాలి. బియ్యాన్ని పాలిష్ పట్టడం వల్ల పై రెండు పొరల్లో ఉండే పోషకాలన్నీ తవుడులోకి వెళ్లిపోతున్నాయి. మిగిలిన తెల్లబియ్యంలో కేవలం కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి. అత్యధిక కార్బోహైడ్రేట్స్ ఉండే ధాన్యాల్లో బియ్యం ఒకటి. బియ్యంలో 77 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అన్నాన్ని ఎంత ఎక్కువగా తింటే షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి.
అలాగే అన్నాన్ని తినడం వల్ల షుగర్ వ్యాధి పెరుగుతుంది. కనుక షుగర్ వ్యాధి అదుపులోకి రావాలనుకునే వారు అన్నాన్ని తినడం మానేయాలి. పుల్కాలను, జొన్న రొట్టెలను మాత్రమే తినాలి. మధ్యాహ్నం పుల్కాలను, రాత్రి జొన్న రొట్టెలను ఎక్కువ కూరలతో ఆహారంగా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనం తీసుకునే కార్బోహైడ్రేట్ ల శాతం తగ్గుతుంది. అలాగే కూరల్లో ఉప్పు లేకుండా తీసుకోవాలి. ఉప్పు తక్కువగా తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి అదుపులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే రెండవది… షుగర్ వ్యాధితో బాధపడే వారు ఉదయం పూట ఇడ్లీ, దోశ, ఉప్మా వంటి అల్పాహారాలను తీసుకోకూడదు. మొలకెత్తిన విత్తనాలను మాత్రమే తీసుకోవాలి. రోజూ ఉదయం 3 రకాల గింజలను మొలకెత్తించి తీసుకోవాలి.
అలాగే వీటితో పాటు పండ్లను తీసుకోవాలి. ఇక చివరిది రోజూ ఉదయం చెమట పట్టేలా వ్యాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. అలాగే రాత్రి భోజనం చేసిన తరువాత ఒక గంట పాటు వాకింగ్ చేయాలి. ఇలా మూడు నియమాలను పాటిస్తూ రోజుకు మూడు సార్లు మాత్రమే ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేయడం వల్ల షుగర్ వ్యాధి తగ్గు ముఖం పడుతుంది. తరచూ రక్తపరీక్షలు చేయించుకుంటూ వైద్యున్ని సంప్రదించి మందుల మోతాదును తగ్గించుకుంటూ ఉండాలి. ఈ విధంగా షుగర్ వ్యాధితో బాధపడే వారు ఈ నియమాలను పాటించడం వల్ల చాలా సులభంగా షుగర్ వ్యాధిని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…