Ganagapur Dattatreya Temple : సాధారణంగా లక్ష్మీ నరసింహస్వామి, కాళికా దేవి, దుర్గాదేవి, ఆంజనేయ స్వామి.. లాంటి దేవతలు, దేవుళ్లు దుష్ట శక్తులను సంహరించేవారుగా పూజలందుకుంటూ ఉంటారు. వారి ఆలయాలను దర్శిస్తే శరీరంపై ఏవైనా గాలి ఉంటే పోతుందని.. దుష్ట శక్తుల పీడ వదులుతుందని నమ్ముతారు. అయితే వీరే కాదు.. ఇలాంటి ప్రత్యేకత ఉన్న ఆలయం ఒకటుంది. అదే.. శ్రీగురు దత్తాత్రేయ క్షేత్రం. ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రంలో ఉంది. దీని ప్రత్యేకతలు, విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా అఫ్జల్పూర్ తాలూకా భూమా నది ఒడ్డున గనాగపూర్ అనే ప్రాంతంలో శ్రీగురు దత్తాత్రేయ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ స్వామికి చెందిన పాదుకలను దర్శించుకుంటారు. ఇక్కడ ప్రవహించే భీమా, అమరాజా అనే నదుల సంగమం చాలా పవిత్రమైందిగా భావిస్తారు. ఇందులో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఈ ఆలయానికి చాలా మంది దుష్టశక్తులను వదిలించుకునేందుకు వస్తుంటారు. ఇక్కడికి వస్తే దెయ్యాలను వదిలించుకోవచ్చని నమ్ముతారు. కొందరు ఈ ఆలయంలోకి రాగానే వింతగా ప్రవర్తిస్తారు. ఏవైనా దుష్ట శక్తులు, గాలి ఉంటే ఈ ఆలయానికి వస్తే పోతాయని చెబుతారు.
ఇక ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ఇక్కడ చుట్టు పక్కల అనేక దర్శనీయ స్థలాలు కూడా ఉన్నాయి. ఇక్కడి భీమా, అమరాజా నదుల సంగమం వద్ద సంగమేశ్వర ఆలయం ఉంది. దీన్ని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటారు. సంగమంలో స్నానం ఆచరించి దైవాన్ని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. అలాగే ఇక్కడికి సమీపంలో అష్ట తీర్థాలు ఉన్నాయి. ఇక్కడ కూడా భక్తులు తమ పాపాలను పోగొట్టుకుంటానికి స్నానాలు ఆచరిస్తుంటారు.
ఇక గనాగపూర్కు హైదరాబాద్ నుంచి వెళ్లాలంటే గుల్బర్గా వరకు ముందుగా వెళ్లాల్సి ఉంటుంది. గుల్బర్గాకు 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. కేఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు. గుల్బర్గా చేరుకున్నాక అక్కడి నుంచి గనాగపూర్కు వెళ్లాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి గుల్బర్గాకు రైలు మార్గంలోనూ వెళ్లవచ్చు. బెంగళూరు చేరుకుని అక్కడి నుంచి కూడా గనాగపూర్కు వెళ్లవచ్చు. ఇక ఈ ఆలయంలో నిత్యం అనేక పూజలు, అభిషేకాలు జరుగుతుంటాయి. ప్రత్యేక సేవలను కూడా నిర్వహిస్తుంటారు. కనుక సేవ వివరాలను తెలుసుకుని వెళితే స్వామి వారిని సులభంగా దర్శించుకోవచ్చు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…