శరీర సౌందర్యంలో గోళ్లకు చాలా ప్రాధాన్యత ఉంది. మన చేతిగోళ్ళు మనకున్న వ్యాధులను చెప్పగలవు అనే విషయం మీకు తెలుసా.. అవును ఇది నిజమే… వ్యాధులను నిర్ధారించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వైద్యులు కొన్నిసార్లు గోర్లను చూసి వారు ఏ వ్యాధితో బాధపడుతున్నారో ఇట్టే చెప్పగలరు. గోళ్ళ ఆరోగ్యం మనుషుల యొక్క ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని చాలా మంది చెబుతుంటారు.
గోళ్ళ ఆరోగ్యంగా ఉంటే వారు ఆరోగ్యంగా ఉన్నారని, గోళ్లు పెళుసుగా ఉంటే వారు తరచుగా వ్యాధుల బారిన పడుతుంటారని పలు అధ్యయనాలలో నిరూపితమైంది.. అయితే గోళ్ళ పై తెల్ల మచ్చలు, రంగు మారడం వంటి కొన్నిరకాల కారణాలు అనారోగ్య సమస్యలకు దారి తీసేందుకు సంకేతమని నిపుణులు సూచిస్తుంటారు. ఈ విషయం తెలియక చాలా మంది గోళ్ల ఆరోగ్యాన్ని, అందాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు.
కొంచెం శ్రద్ద తీసుకుంటే గోళ్లను ఎంతో అందంగా ఉండేలా చేసుకోవచ్చు. గోళ్లు పాలిపోయినట్లుగా ఉంటే రక్తహీనత ఉన్నట్లు, అదేవిధంగా గోళ్లు లేత గులాబీ రంగులో ఉంటే రక్తం తగినంత ఉందని అర్థం చేసుకోవచ్చు. గోళ్ల ఎదుగుదల తక్కువగా ఉండి పసుపు రంగులో మందంగా ఉంటే మూత్రపిండాల ఆరోగ్యం సరిగ్గా లేదని గుర్తు ఉంచుకోవాలి. అదే గోళ్లపై తెల్లటి మచ్చలు ఉంటే కాల్షియం లోపంగా గుర్తించాలి. సరైన పోషకాహారం తీసుకోకపోతే ఆ ప్రభావం గోళ్లపై పడుతుంది. విటమిన్ బి, సి లోపం వల్ల గోళ్లు చిట్లాటం వంటి సమస్య ఏర్పడుతుంది. అందువలన గోళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్, విటమిన్ ఎ, బి, ఇ, సి, ఉండే ఆహారాలను పుష్కలంగా తీసుకోవాలి.
గోళ్లను ఆరోగ్యంగా అందంగా కనిపించాలంటే ఈ చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. వేడి నీటిలో కొంచెం నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఆ నీళ్లలో స్పాంజ్ని తడిపి దానితో గోళ్లను శుభ్రం చేసుకోవాలి. తర్వాత గోళ్లకు మాయిశ్చరైజింగ్ క్రీమ్ లేదా లోషన్ రాయాలి. ఇలా ప్రతి రోజు చేస్తే మీ గోళ్లను అందంగా ఆరోగ్యంగా తయారవుతాయి.
గోళ్లను ఆరోగ్యంగా కాపాడుకోవడానికి మరో అద్భుతమైన చిట్కా ఏమిటంటే. విటమిన్ ఈ క్యాప్సూల్ని బ్రేక్ చేసి అందులోని నూనెను గోళ్లపై రాసుకుని మర్ధన చేసుకుంటే గోళ్లు మెత్తగా, ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఇక గోళ్లపై ఎక్కువగా గీతలు పడితే వేడినీటిలో నిమ్మరసం కలిపి అందులో ఒక 20 నిమిషాల పాటు గోళ్లను నానబెట్టుకుని తర్వాత మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…