Honey And Fruits : ప్రస్తుత తరుణంలో అధిక శాతం మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. ఒకప్పుడు వృద్ధులకు మాత్రమే షుగర్ సమస్య వచ్చేది. కానీ ఇప్పుడు యువత కూడా దీని బారిన పడుతున్నారు. అస్తవ్యస్తమైన జీవన విధానం వల్లే షుగర్ వస్తోంది. అధిక శాతం మంది టైప్ 2 డయాబెటిస్తో బాధపడుతున్నారు. అయితే ఈ వ్యాధి ఉన్నవారు ఆహారం విషయంలో ముఖ్యమైన జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పండ్లు, తేనె తీసుకునే విషయంలో అనేక సందేహాలు వస్తుంటాయి. వాటికి నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
డయాబెటిస్ ఉన్నవారు నిర్భయంగా పండ్లను తినవచ్చు. పండ్లలో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. ఇవి రక్తంలో నెమ్మదిగా కలుస్తాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారు ఎలాంటి జంకు లేకుండా పండ్లను తినవచ్చు. అయితే పండ్లను మాత్రం అతిగా తినరాదు. ఉదాహరణకు ఒక పూట 2 చపాతీలను తింటున్నారని అనుకుందాం. పండ్లను తినదలిస్తే ఒక చపాతీ చాలు. మిగిలిన చపాతీకి బదులుగా ఏవైనా పండ్లను తినండి. ఇలా డయాబెటిస్ ఉన్నవారు పండ్లను తిన్నా ఏమీ కాదు. షుగర్ లెవల్స్ పెరగవు. ఇలా మోతాదులో తినాల్సి ఉంటుంది.
ఇక కొన్ని రకాల పండ్లకు గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) విలువ ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ పండ్లను తింటే చక్కెరలు త్వరగా రక్తంలో కలుస్తాయన్నమాట. దీంతో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. కొన్ని రకాల పండ్లు మరీ తియ్యగా ఉంటాయి. ఇలా పండ్లను తింటే షుగర్ లెవల్స్ అమాంతంగా పెరుగుతాయి. కనుక జీఐ విలువ ఎక్కువగా ఉన్న పండ్లను అయితే తినరాదు. జీఐ విలువ తక్కువగా ఉండే పండ్లను తింటే మేలు జరుగుతుంది. ఇలా డయాబెటిస్ ఉన్నవారు పలు రకాల జాగ్రత్తలను పాటిస్తూ పండ్లను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. దీంతో ఎలాంటి ఇబ్బందులు రావు.
ఇక తేనెను కూడా షుగర్ ఉన్నవారు వాడవచ్చు. కానీ రోజు మొత్తంలో తీసుకున్న కార్బొహైడ్రేట్స్ శాతం తగ్గించాలి. అందుకు బదులుగా తేనె తీసుకోవచ్చు. లేదంటే షుగర్ లెవల్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. తేనె సహజసిద్ధమైనదే. కానీ కొందరిలో షుగర్ లెవల్స్పై ప్రభావం చూపించవచ్చు. కనుక తేనెను వాడే ముందు డాక్టర్ను సంప్రదించడం ఉత్తమం. రోజులో తీసుకునే కార్బొహైడ్రేట్లను కాస్త తగ్గించి దానికి బదులుగా తేనెను తీసుకోవచ్చు. దీంతో ఎలాంటి ఇబ్బందులు రావు. ఇలా డయాబెటిస్ ఉన్నవారు తేనెను కూడా జాగ్రత్తలు పాటిస్తూ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకానీ తేనె గురించి భయపడాల్సిన పనిలేదు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…