భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా అందిస్తాయి. అయితే, పప్పుల నుంచి పూర్తి పోషక ప్రయోజనాలు పొందాలంటే ఒక ముఖ్యమైన నియమాన్ని తప్పనిసరిగా పాటించాలని పోషకాహార నిపుణురాలు దీప్సికా జైన్ సూచించారు. ఇన్స్టాగ్రామ్లో పోస్టులో ఆమె, పప్పులను వండే ముందు తప్పకుండా నానబెట్టాలని (soaking) చెప్పారు. ఇలా నానబెట్టడం వల్ల పప్పుల్లో ఉండే యాంటీ న్యూట్రియెంట్స్ తగ్గి, జీర్ణక్రియ మెరుగవుతుందని ఆమె వివరించారు.
దీప్సికా జైన్ మాటల్లో, పప్పులు గుండె ఆరోగ్యం, పేగుల ఆరోగ్యం (గట్ హెల్త్), రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతో సహాయపడతాయి. కానీ నానబెట్టకుండా వండితే ఈ ప్రయోజనాలు పూర్తిగా అందవని ఆమె హెచ్చరించారు. ముఖ్యంగా జీర్ణ సమస్యలు, గ్యాస్ లేదా పొత్తికడుపు ఉబ్బరం ఎక్కువగా ఉండేవారు మొత్తం పప్పుల కంటే విడగొట్టిన పప్పులు (split dals) తినడం మంచిదని చెప్పారు. వీటిలో తొక్క తొలగిపోవడం వల్ల సంక్లిష్ట చక్కెరలు, యాంటీ న్యూట్రియెంట్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి, పొట్టలో తేలికగా జీర్ణమవుతాయి.
గుండె ఆరోగ్యం బలహీనంగా ఉన్నవారికి శనగలు (చిక్ పీస్) మంచివని ఆమె సూచించారు. వీటిలో పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల గుండె పనితీరు మెరుగుపడటంతో పాటు బరువు నియంత్రణకూ సహాయపడతాయని తెలిపారు. అలాగే PCOS సమస్య ఉన్న మహిళలకు మొత్తం పెసరపప్పు (whole moong dal) ఉత్తమమని, ఇది తేలికగా జీర్ణమై శరీరంలో వాపు (inflammation) తగ్గించడంలో, హార్మోన్ల సమతుల్యతను కాపాడడంలో సహాయపడుతుందని చెప్పారు. డయాబెటిస్ ఉన్నవారికి మసూర్ దాల్ (ఎర్ర పప్పు) మంచిదని, ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ మెరుగవుతుందని వివరించారు.
మొత్తానికి, సరైన రకం పప్పును ఎంపిక చేయడం మాత్రమే కాకుండా, వండే ముందు నానబెట్టడం కూడా ఎంతో కీలకమని ఆమె చెబుతున్నారు. ఇలా చేస్తే పప్పుల నుంచి గరిష్ట పోషక విలువలు లభిస్తాయి, జీర్ణ సమస్యలు తగ్గుతాయి, ఆరోగ్యం మరింత మెరుగవుతుంది.
గమనిక: ఇవన్నీ సాధారణ సమాచారం కోసం మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య సమస్యల విషయంలో వైద్యులు లేదా పోషకాహార నిపుణుల సలహా తీసుకోవాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…