Eye Sight : కళ్లు.. భగవంతుడు మనకు ప్రసాదించిన ఓ వరమనే చెప్పవచ్చు. ఎందుకంటే కళ్లతో మనం ఈ సృష్టిని చూస్తున్నాం. ఎన్నో విషయాలను తెలుసుకోగలుగుతున్నాం. చెవులతో వినలేని, మాటలతో చెప్పలేని ఎన్నో భావాలను కళ్ల ద్వారా తెలుపుతున్నాం. అలాంటి భావాలను నేర్చుకుంటూ ఉన్నాం. ఈ క్రమంలో అలాంటి కళ్లను ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా రక్షించుకోవాలి. లేదంటే అనేక దృష్టి సంబంధ సమస్యలు వస్తాయి. ఇప్పుడైతే చాలా మంది అనేక కంటి సమస్యలతో సతమతమవుతున్నారు. చిన్న వయస్సులోనే పెద్ద సైట్ కలిగిన అద్దాలను వాడాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఈ క్రమంలో అలాంటి వారు తమ కంటి సమస్యలను తొలగించుకోవాలన్నా, మంచి చూపు కావాలన్నా కింద ఇచ్చిన కొన్ని టిప్స్ పాటించండి, చాలు. కొద్ది రోజులు లేదా నెలల్లోనే మీ కంటి సమస్యలు పోతాయి. దృష్టి బాగా వస్తుంది.
100 గ్రాముల బాదం పప్పు, 100 గ్రాముల సోంపు, 100 గ్రాముల చక్కెర, అన్నింటినీ కలిపి మెత్తని పౌడర్లా చేయాలి. ఈ పొడిని 2 టీస్పూన్ల మోతాదులో ఒక గ్లాస్ వేడి పాలలో కలిపి ప్రతి రోజు రాత్రి పూట నిద్రించే ముందు తాగాలి. దీంతో దృష్టి సంబంధ సమస్యలు పోతాయి. కంటి చూపు మెరుగు పడుతుంది. 8 నుంచి 10 బాదం పప్పులను తీసుకుని రాత్రి పూట నీటిలో నానబెట్టాలి. ఉదయం ఆ బాదంపప్పు పొట్టును తీసివేయాలి. అనంతరం వాటిని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఆ పేస్ట్ను ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని వేడి పాలలో కలిపి ఉదయాన్నే తాగాలి. ఒకటి, రెండు నెలల పాటు ఇలా తాగితే చూపు బాగా వస్తుంది. కంటి సమస్యలు పోతాయి.
6 నుంచి 8 పచ్చి ఉసిరి కాయలను తీసుకుని బాగా కడిగి వాటిలోంచి విత్తనాలను వేరు చేసి ఆ కాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ ముక్కలను మిక్సీలో వేసి మిశ్రమంగా చేశాక దాన్నుంచి జ్యూస్ను తీయాలి. ఈ జ్యూస్ను తేనెతో కలిపి నిత్యం ఉదయాన్నే తాగాలి. దీని వల్ల కంటి సమస్యలు పోయి దృష్టి బాగా వస్తుంది. అరకిలో వాల్నట్స్, 300 గ్రాముల తేనె, 100 గ్రాముల కలబంద గుజ్జు లేదా జ్యూస్, 4 నిమ్మకాయలను తీసుకోవాలి. నిమ్మకాయలను పిండి వాటి నుంచి రసం తీసి దాన్ని మిగిలిన పదార్థాలకు బాగా కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు 3 సార్లు తీసుకోవాలి. ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్కు ముందు ఈ మిశ్రమాన్ని సేవిస్తుంటే క్రమంగా కంటి చూపు మెరుగవుతుంది. 6 నెలల గర్భం దాటిన మహిళలు, కిడ్నీలు, గ్యాస్ సమస్యలు ఉన్నవారు దీన్ని తీసుకోకూడదు.
విటమిన్ ఎ ఎక్కువగా ఉండే యాపిల్, క్యారెట్, పాలకూర వంటి ఆహారాన్ని నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకుంటుంటే కంటి చూపు మెరుగు పడుతుంది. ఉదయాన నిద్రలేవగానే చల్లని నీటితో కళ్లను కడుక్కోవాలి. కళ్లు బాగా ఒత్తిడికి గురై మంటలుగా ఉన్నప్పుడు కూడా చల్లని నీటితో కడుక్కోవచ్చు. లేదంటే రెండు అరచేతులను బాగా రుద్ది కళ్లపై పెట్టుకోవాలి. దీని వల్ల వేడి కళ్లకు తాకి కంటి నరాలు రిలాక్స్ అవుతాయి. ఒక కొవ్వొత్తిని వెలిగించి దాన్నే తదేకంగా చూస్తూ నెమ్మదిగా కళ్లు మూసుకోవాలి. మళ్లీ నెమ్మదిగా కళ్లు తెరవాలి. ఇలా కనీసం 5 సార్లు చేయాలి. దీంతో సమస్య పరిష్కారమవుతుంది. కంటి చూపు పెరుగుతుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…