Eye Sight : కళ్లు.. భగవంతుడు మనకు ప్రసాదించిన ఓ వరమనే చెప్పవచ్చు. ఎందుకంటే కళ్లతో మనం ఈ సృష్టిని చూస్తున్నాం. ఎన్నో విషయాలను తెలుసుకోగలుగుతున్నాం. చెవులతో వినలేని, మాటలతో చెప్పలేని ఎన్నో భావాలను కళ్ల ద్వారా తెలుపుతున్నాం. అలాంటి భావాలను నేర్చుకుంటూ ఉన్నాం. ఈ క్రమంలో అలాంటి కళ్లను ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా రక్షించుకోవాలి. లేదంటే అనేక దృష్టి సంబంధ సమస్యలు వస్తాయి. ఇప్పుడైతే చాలా మంది అనేక కంటి సమస్యలతో సతమతమవుతున్నారు. చిన్న వయస్సులోనే పెద్ద సైట్ కలిగిన అద్దాలను వాడాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఈ క్రమంలో అలాంటి వారు తమ కంటి సమస్యలను తొలగించుకోవాలన్నా, మంచి చూపు కావాలన్నా కింద ఇచ్చిన కొన్ని టిప్స్ పాటించండి, చాలు. కొద్ది రోజులు లేదా నెలల్లోనే మీ కంటి సమస్యలు పోతాయి. దృష్టి బాగా వస్తుంది.
100 గ్రాముల బాదం పప్పు, 100 గ్రాముల సోంపు, 100 గ్రాముల చక్కెర, అన్నింటినీ కలిపి మెత్తని పౌడర్లా చేయాలి. ఈ పొడిని 2 టీస్పూన్ల మోతాదులో ఒక గ్లాస్ వేడి పాలలో కలిపి ప్రతి రోజు రాత్రి పూట నిద్రించే ముందు తాగాలి. దీంతో దృష్టి సంబంధ సమస్యలు పోతాయి. కంటి చూపు మెరుగు పడుతుంది. 8 నుంచి 10 బాదం పప్పులను తీసుకుని రాత్రి పూట నీటిలో నానబెట్టాలి. ఉదయం ఆ బాదంపప్పు పొట్టును తీసివేయాలి. అనంతరం వాటిని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఆ పేస్ట్ను ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని వేడి పాలలో కలిపి ఉదయాన్నే తాగాలి. ఒకటి, రెండు నెలల పాటు ఇలా తాగితే చూపు బాగా వస్తుంది. కంటి సమస్యలు పోతాయి.
6 నుంచి 8 పచ్చి ఉసిరి కాయలను తీసుకుని బాగా కడిగి వాటిలోంచి విత్తనాలను వేరు చేసి ఆ కాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ ముక్కలను మిక్సీలో వేసి మిశ్రమంగా చేశాక దాన్నుంచి జ్యూస్ను తీయాలి. ఈ జ్యూస్ను తేనెతో కలిపి నిత్యం ఉదయాన్నే తాగాలి. దీని వల్ల కంటి సమస్యలు పోయి దృష్టి బాగా వస్తుంది. అరకిలో వాల్నట్స్, 300 గ్రాముల తేనె, 100 గ్రాముల కలబంద గుజ్జు లేదా జ్యూస్, 4 నిమ్మకాయలను తీసుకోవాలి. నిమ్మకాయలను పిండి వాటి నుంచి రసం తీసి దాన్ని మిగిలిన పదార్థాలకు బాగా కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు 3 సార్లు తీసుకోవాలి. ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్కు ముందు ఈ మిశ్రమాన్ని సేవిస్తుంటే క్రమంగా కంటి చూపు మెరుగవుతుంది. 6 నెలల గర్భం దాటిన మహిళలు, కిడ్నీలు, గ్యాస్ సమస్యలు ఉన్నవారు దీన్ని తీసుకోకూడదు.
విటమిన్ ఎ ఎక్కువగా ఉండే యాపిల్, క్యారెట్, పాలకూర వంటి ఆహారాన్ని నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకుంటుంటే కంటి చూపు మెరుగు పడుతుంది. ఉదయాన నిద్రలేవగానే చల్లని నీటితో కళ్లను కడుక్కోవాలి. కళ్లు బాగా ఒత్తిడికి గురై మంటలుగా ఉన్నప్పుడు కూడా చల్లని నీటితో కడుక్కోవచ్చు. లేదంటే రెండు అరచేతులను బాగా రుద్ది కళ్లపై పెట్టుకోవాలి. దీని వల్ల వేడి కళ్లకు తాకి కంటి నరాలు రిలాక్స్ అవుతాయి. ఒక కొవ్వొత్తిని వెలిగించి దాన్నే తదేకంగా చూస్తూ నెమ్మదిగా కళ్లు మూసుకోవాలి. మళ్లీ నెమ్మదిగా కళ్లు తెరవాలి. ఇలా కనీసం 5 సార్లు చేయాలి. దీంతో సమస్య పరిష్కారమవుతుంది. కంటి చూపు పెరుగుతుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…