Active Brain : మానవ శరీరంలో మెదడు చాలా ముఖ్యమైన అవయవం. మన బాడీ వెయిట్ లో మెదడుది రెండు శాతమే అయినా దీని విధులు ప్రత్యేకం. ప్రతి వ్యక్తి యొక్క శక్తి సామర్ధ్యాలు, జ్ఞాపక శక్తి, ధారణా శక్తి అతని మేధాశక్తి మీదే ఆధారపడి ఉంటాయి. సో అలాంటి మైండ్ ను యాక్టివ్ గా ఉంచుకోవాలంటే ఈ 4 పనులు చేయాలి. అవేంటో ఓ సారి చూద్దాం. మనం ఏదైనా చదవాలనుకున్నప్పుడు దానిని శ్రద్ధతో పఠించడంవల్ల మెదడులో అబిజ్ఞా సామర్ధ్యాలు పెరిగి మెదడును ఉత్తేజపరుస్తాయి. అంతేకాక రక్త ప్రసరణ అనాసక్త భాగాలలో విరివిగా జరిగి జ్ఞాపకశక్తి మెరుగవుతుందని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రజ్ఞుల పరిశోధనలలో తేలింది. కానీ ఇది కేవలం పఠనం వల్లనే సాధ్యం, ఆటల ద్వారా, టీవీ వీక్షణం వల్ల కాదట. కనుక మెదడును యాక్టివ్గా ఉంచుకోవాలంటే రోజూ పుస్తకాలను చదవాలి.
డ్రాయింగ్ వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది. ఇటీవల జరిగిన ఒక సర్వేలో 62 -70 సంవత్సరాల వయోవృద్ధులలో పెయింటింగ్, ఆర్ట్స్ విభాగాలలో విభజిస్తే పెయింటింగ్ వర్గం వారి మెదడు పనితీరు మెరుగ్గా ఉందని తేలింది. కనుక మెదడును యాక్టివ్గా ఉంచడం కోసం పెయింటింగ్ కూడా ఎంతగానో పనిచేస్తుంది. మనం తినే ఆహరంలో ఉండే ఫ్రక్టోజ్ మన జ్ఞాపకశక్తిని, సాధనా శక్తిని తగ్గిస్తుంది. దీనికి కారణం చక్కెరలు మెదడులోని నాడీవ్యవస్థను బలహీన పరుస్తాయి. దీంతో మెదడు స్తబ్దుగా మారుతుంది. కనుక మెదడు యాక్టివ్గా ఉండాలంటే చక్కెరలకు దూరంగా ఉండాలి.
మన మెదడులో 80 శాతం మేర నీరు ఉంటుంది. అందులో ఏమాత్రం తగ్గినా చాలు.. మెదడు పనితీరు తగ్గుతుంది. కనుక నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు గాను మనం రోజూ తగిన మోతాదులో నీళ్లను తాగాల్సి ఉంటుంది. దీంతో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటాము. మెదడులో నీటి శాతం తగ్గదు. ఫలితంగా మెదడుకు నీరు సరిగ్గా సరఫరా అవుతుంది. ఇది మన మెదడును యాక్టివ్గా ఉంచుతుంది. కనుక మెదడు యాక్టివ్గా ఉండాలంటే రోజూ తగినన్ని నీళ్లను తాగాల్సి ఉంటుంది. లేదంటే మెదడు పనితీరు మందగిస్తుంది. ఇలా మెదడు యాక్టివ్గా ఉండాలంటే పలు సూచనలను పాటించాల్సి ఉంటుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…