Fish Bone In Throat : చేపలు అంటే చాలా మందికి ఇష్టమే. వాటిని మాంసాహార ప్రియులు చాలా మంది ఇష్టంగా తింటారు. చేపల కూర, వేపుడు, బిర్యానీ.. ఇలా ఏం చేసినా, ఎలా చేసినా చేపలను బాగా లాగించే వారు కూడా ఉన్నారు. అయితే ఇంత వరకు ఓకే. కానీ చేపలను తినేటప్పుడు పొరపాటున దాని ముల్లు గొంతులో ఇరుక్కుంటేనో..? అంటే.. అవును.. ఆ చాన్స్ ఉంది. అందుకే చేప ముక్కలను తినేటప్పుడు చాలా మంది జంకుతారు. వాటిని నెమ్మదిగా తింటారు. అయినా.. పొరపాటున చేపల ముళ్లు గొంతులో ఇరుక్కుంటే..? అప్పుడు ఏం చేయాలో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.
చేప ముల్లు గొంతులో ఇరుక్కుంటే ఎవర్నయినా పొట్ట మీద గట్టిగా ఒత్తమని చెప్పాలి. దీంతో గాలి అన్నవాహికకు ప్రసారమవుతుంది. అదే పనిగా ఒత్తుతూ ఉంటే గాలికి ఆ ముల్లు బయటకు వస్తుంది. లేదంటే లోపల జీర్ణాశయంలోనికి చేరుతుంది. అక్కడికి చేరితే ఇబ్బందేమీ ఉండదు. ఎలాంటి పదార్థన్నయినా అరిగించే శక్తి మన కడుపులో యాసిడ్కు ఉంటుంది. చేప ముల్లు గొంతులో ఇరుక్కుపోయిన వ్యక్తిని ఒంగోమని చెప్పాలి. ఎవరైనా ఆ వ్యక్తుల వీపుపై కొట్టాలి. దీంతో ముల్లు బయటకు వస్తుంది. ఆ సమయంలో నోరు తెరిచి ఉంచాల్సి ఉంటుంది.
చేప ముల్లు గొంతులో ఇరుక్కుంటే వండిన అన్నాన్ని ఒక కప్పు మోతాదులో తీసుకుని దాన్ని అలాగే నమలకుండా మింగేయాలి. వెంటనే నీరు తాగాలి. దీంతో గొంతులో ఉన్న ముల్లు పోతుంది. ఒక అరటి పండును తీసుకుని సగానికి కొరికి నమలకుండానే అలాగే దాన్ని మింగాలి. అనంతరం నీరు తాగాలి. ఇలా చేస్తే గొంతులో ఉన్న ముల్లు పోతుంది. రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకుని బాగా నమిలి మింగాలి. అవి కూడా ముల్లును లోపలకి తీసుకుపోతాయి.
బ్రౌన్ బ్రెడ్ పీస్ను ఒకటి తీసుకుని దానికి రెండు వైపులా పీనట్ బటర్ రాయాలి. అనంతరం బ్రెడ్ను నోట్లో పెట్టుకుని మెత్తగా అయ్యేవరకు అలాగే ఉండాలి. అనంతరం దాన్ని నమలకుండా మింగాలి. వెంటనే నీరు తాగాలి. దీంతో ఆ బ్రెడ్కు అతుక్కుని ముల్లు లోపలికి పోతుంది. పైన చెప్పిన చిట్కాలు పనిచేయకపోతే ప్రయోగాలు చేయడం మాని వైద్యున్ని సంప్రదించడం బెటర్. లేదంటే గాయమై ఇన్ఫెక్షన్ బారిన పడతారు. ఆ తరువాత బాధపడీ ప్రయోజనం ఉండదు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…