Taping Toes : హై హీల్స్ వేసుకోవడం, స్థూలకాయం, ఎక్కువ సేపు నిలబడి ఉండడం, తిరగడం.. ఇలా కారణాలు ఏమున్నా నేడు అధిక శాతం మంది కాలి నొప్పులతో బాధ పడుతున్నారు. ప్రధానంగా రాత్రి పూట వీటి బాధ మరింత వర్ణనాతీతం. ఈ క్రమంలో పెయిన్ కిల్లర్లు, స్ప్రేలు వాడే బదులు కింద ఇచ్చిన ఓ చిట్కా పాటిస్తే చాలు. మీ కాలినొప్పి ఇట్టే తగ్గిపోతుంది. ఆ చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెడికల్, సర్జికల్ దుకాణాల్లో రిజిడ్ స్పోర్ట్స్ టేప్ (Rigid Sports Tape) అని ఓ టేప్ దొరుకుతుంది. ఇది తక్కువ ధరకే లభిస్తుంది. 38 ఎంఎం మందం కలిగి స్టిఫ్గా ఉంటుంది.
ఈ టేప్ను తీసుకుని కాలి చూపుడు వేలికి, మధ్య వేలికి కలిపి ప్లాస్టర్లా వేయాలి. అయితే ఇలా రాత్రి పూట చేయాలి. ఎందుకంటే ఆ సమయంలోనే కదా మన కాళ్లు విశ్రాంత స్థితిలో ఉండేది. ఇలా కాలి వేళ్లకు టేప్ వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే తీసేయాలి. తరచూ ఇలా చేయడం వల్ల కాళ్లలో వచ్చే సాధారణ నొప్పులు తగ్గిపోతాయి. అంతేకాదు పాదాలపై ఒత్తిడి ఎక్కువగా పడకుండా ఉంటుంది. నడిచే సమయంలో పాదాలు సరిగ్గా భూమిపై ఆనేలా ఓ ఆకృతి (పోస్చర్) డెవలప్ అవుతుంది. పాదాలు, కాళ్ల కింది భాగంలో అయిన గాయాలు త్వరగా మానేందుకు ఉపయోగపడుతుంది.
ఎక్కువ దూరం రన్నింగ్ చేసినా పాదాలపై ఒత్తిడి కలగకుండా ఉంటుంది. ఏవైనా క్రీడలు ఆడుతున్న సమయంలో ఇలా టేపింగ్ చేసుకుంటే వేళ్లపై అదనపు ఒత్తిడి పడకుండా ఉంటుంది. ఇది గాయాలు కాకుండా కూడా నిరోధిస్తుంది. అయితే టేపింగ్ చేసిన క్రమంలో వేళ్లు వాపుకు గురవడం, ఎరుపుగా మారడం, దురద రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఫిజియోథెరపీ వైద్యున్ని సంప్రదించాలి. వైద్యుడి సలహా మేరకే టేపింగ్ వేసుకోవాలి.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…