Curry Leaves : మనం రోజూ వంటల్లో ఉపయోగించే పదార్థాల్లో కరివేపాకు కూడా ఒకటి. కరివేపాకులను వేయడం వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే కరివేపాకులను కూరల్లోంచి తీసిపారేస్తుంటారు. కానీ అలా పడేయరాదు. కరివేపాకులను తినడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కరివేపాకులతో మనం ఎలాంటి రోగాలను నయం చేసుకోవచ్చో.. వాటిని ఎలా ఉపయోగించాలో.. ఇప్పుడు తెలుసుకుందాం. కరివేపాకులు మనకు అనేక రకాలుగా ఉపయోగపడతాయి.
కడుపులో తేడాగా రకరకాలుగా ఉంటే రెండు స్పూన్స్ కరివేపాకు రసంలో ఓ స్పూన్ నిమ్మరసం, కొద్దిగా పంచదార కలిపి తాగండి. ప్రశాంతంగా ఉంటుంది. కరివేపాకును పేస్ట్ లా చేసి ఒక స్పూన్ పేస్ట్ ని ఒక గ్లాస్ పలుచని మజ్జిగలో కలిపి అప్పుడప్పుడూ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఇలా వేసవిలో తీసుకుంటే శరీరానికి చలువ చేస్తుంది. శరీరంలోని వేడి మొత్తం తగ్గిపోతుంది. అలాగే శరీర బరువును, రక్తంలో చక్కెరను తగ్గించే గుణాలు కరివేపాకులో అధికంగా ఉంటాయి. కాబట్టి వంశపారంపర్యంగా మధుమేహం వచ్చే అవకాశాలు ఉన్నవారు రోజూ ఉదయం పది కరివేపాకులని నోట్లో వేసుకుని నేరుగా అలాగే నమిలి మింగాలి. దీంతో షుగర్ రాదు. షుగర్ ఉన్నవారు కూడా ఇలా చేస్తే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.
కాలిన గాయాల మీద కరివేపాకు పేస్ట్ ని వేసి కట్టుకడితే త్వరగా తగ్గుముఖం పడతాయి. కరివేపాకు చెట్టుకి ఉండే కాయల నుంచి రసం తీసి రాస్తే పురుగులు కుట్టినచోట వచ్చే దద్దుర్లు తగ్గిపోతాయి. ఒక బౌల్ లో కొబ్బరినూనెలో కరివేపాకులు వేసి ఆకులు నల్లగా పొడి పొడి అయ్యేవరకు స్టవ్ మీద పెట్టి వేడి చేసి తర్వాత చల్లార్చి పెట్టుకోండి. ప్రతిరోజూ ఈ ఆయిల్ ని తలకు రాసుకోవడం వల్ల జుట్టు రాలడం, నెరవడం వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు.
కరివేపాకును పచ్చడిగానో లేక విడిగానో తిన్నా, లేదా దాని రసం మజ్జిగలో కలుపుకుని రోజూ తాగినా అది ఒంటికి చాలా మంచి చేస్తుంది. దీంతో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె సంబంధ సమస్యలు రావు. అలాగే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఇలా కరివేపాకులతో మనం ఎన్నో రోగాలను నయం చేసుకోవచ్చు. కనుక వీటిని రోజూ తీసుకోవడం మరిచిపోకండి.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…