Curry Leaves : మనం రోజూ వంటల్లో ఉపయోగించే పదార్థాల్లో కరివేపాకు కూడా ఒకటి. కరివేపాకులను వేయడం వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే కరివేపాకులను కూరల్లోంచి తీసిపారేస్తుంటారు. కానీ అలా పడేయరాదు. కరివేపాకులను తినడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కరివేపాకులతో మనం ఎలాంటి రోగాలను నయం చేసుకోవచ్చో.. వాటిని ఎలా ఉపయోగించాలో.. ఇప్పుడు తెలుసుకుందాం. కరివేపాకులు మనకు అనేక రకాలుగా ఉపయోగపడతాయి.
కడుపులో తేడాగా రకరకాలుగా ఉంటే రెండు స్పూన్స్ కరివేపాకు రసంలో ఓ స్పూన్ నిమ్మరసం, కొద్దిగా పంచదార కలిపి తాగండి. ప్రశాంతంగా ఉంటుంది. కరివేపాకును పేస్ట్ లా చేసి ఒక స్పూన్ పేస్ట్ ని ఒక గ్లాస్ పలుచని మజ్జిగలో కలిపి అప్పుడప్పుడూ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఇలా వేసవిలో తీసుకుంటే శరీరానికి చలువ చేస్తుంది. శరీరంలోని వేడి మొత్తం తగ్గిపోతుంది. అలాగే శరీర బరువును, రక్తంలో చక్కెరను తగ్గించే గుణాలు కరివేపాకులో అధికంగా ఉంటాయి. కాబట్టి వంశపారంపర్యంగా మధుమేహం వచ్చే అవకాశాలు ఉన్నవారు రోజూ ఉదయం పది కరివేపాకులని నోట్లో వేసుకుని నేరుగా అలాగే నమిలి మింగాలి. దీంతో షుగర్ రాదు. షుగర్ ఉన్నవారు కూడా ఇలా చేస్తే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.
కాలిన గాయాల మీద కరివేపాకు పేస్ట్ ని వేసి కట్టుకడితే త్వరగా తగ్గుముఖం పడతాయి. కరివేపాకు చెట్టుకి ఉండే కాయల నుంచి రసం తీసి రాస్తే పురుగులు కుట్టినచోట వచ్చే దద్దుర్లు తగ్గిపోతాయి. ఒక బౌల్ లో కొబ్బరినూనెలో కరివేపాకులు వేసి ఆకులు నల్లగా పొడి పొడి అయ్యేవరకు స్టవ్ మీద పెట్టి వేడి చేసి తర్వాత చల్లార్చి పెట్టుకోండి. ప్రతిరోజూ ఈ ఆయిల్ ని తలకు రాసుకోవడం వల్ల జుట్టు రాలడం, నెరవడం వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు.
కరివేపాకును పచ్చడిగానో లేక విడిగానో తిన్నా, లేదా దాని రసం మజ్జిగలో కలుపుకుని రోజూ తాగినా అది ఒంటికి చాలా మంచి చేస్తుంది. దీంతో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె సంబంధ సమస్యలు రావు. అలాగే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఇలా కరివేపాకులతో మనం ఎన్నో రోగాలను నయం చేసుకోవచ్చు. కనుక వీటిని రోజూ తీసుకోవడం మరిచిపోకండి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…