Buttermilk : ప్రతి ఏడాది లాగానే ఈ సారి కూడా చలికాలం ముగిసింది. ఎండలు అప్పుడే విజృంభిస్తున్నాయి. ఇక రానున్న నెలల్లో వేడి మరింత పెరగనుంది. దీంతో వేసవి తాపం మొదలవుతుంది. ప్రజలు ఇప్పుడే శరీరాన్ని చల్లబరుచుకునే మార్గాలను అనుసరిస్తున్నారు. అందులో భాగంగానే రకరకాల పానీయాలను సేవిస్తున్నారు. ఇక వేసవిలో చాలా మంది తాగే పానీయాల్లో మజ్జిగ కూడా ఒకటి. కానీ దీన్ని ఏ సీజన్లో అయినా సరే రోజూ తాగవచ్చు. రోజూ ఒక గ్లాస్ మజ్జిగను సేవించడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మజ్జిగలో నిమ్మరసం కలుపుకొని తాగితే ఎండదెబ్బ తాకే ప్రమాదం ఉండదు. దాంతో పాటు వేసవి తాపం కూడా తీరుతుంది. డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటారు. మజ్జిగలో ప్రొటీన్స్, మినరల్స్ ఉంటాయి. ఇవి చాలా ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. కనుక ఈ సీజన్లోనే కాదు.. ఎప్పుడైనా సరే రోజూ ఒక గ్లాస్ మజ్జిగను తాగాల్సిందే.
అంతే కాదు.. కాల్షియం లోపంతో బాధ పడేవాళ్లు మజ్జిగను తాగితే వాళ్ల ఎముకలు, దంతాలు కూడా దృఢపడతాయి. రోజూ మజ్జిగను తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్లు రాకుండా చూసుకోవచ్చు. అలాగే గ్యాస్, అజీర్తి సమస్యలతో బాధపడేవాళ్లు కూడా మజ్జిగను రోజూ తాగొచ్చు. దీంతో పొట్టంతా ఎలాంటి అలజడి లేకుండా ఉంటుంది. కడుపులో మంట కూడా తగ్గుతుంది.
ఎండాకాలం చాలామందికి వేడి చేస్తుంది. ఆ వేడిని తగ్గించుకోవడానికి కూడా మజ్జిగను తాగొచ్చు. అందుకే.. మిట్టమధ్యాహ్నం వాతావరణం వేడిగా ఉన్నప్పుడు మజ్జిగ తాగితే కడుపు చల్లగా ఉంటుంది. కనుక మజ్జిగను అంత తేలిగ్గా తీసుకోకండి. దీన్ని రోజూ ఒక గ్లాస్ చొప్పున తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…