Meals : నేటి తరుణంలో మన జీవన విధానంలో మనం అనుసరిస్తున్న అలవాట్లు, చేస్తున్న పొరపాట్ల వల్ల మనకు అనేక రకాల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. వాటిల్లో స్థూలకాయం, గుండె జబ్బులు, డయాబెటిస్ లు చాలా ముఖ్యమైనవి. ఇవే కాదు, మనం చేస్తున్న అనేక పనుల వల్ల కూడా మనకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అదీ ముఖ్యంగా భోజనం చేసిన తరువాత మనం పాటిస్తున్న కొన్ని అలవాట్లు మనకు చేటు చేస్తున్నాయి. వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
భోజనం చేసిన తరువాత పండ్లను తినరాదు. తింటే అవి జీర్ణాశయానికి చేరి అటునుంచి పేగుల్లోకి వెళ్లేందుకు చాలా సమయం పడుతుంది. దీంతో గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణం కాదు. కనుక భోజనం చేసిన వెంటనే పండ్లను తినరాదు. కావాలంటే ఒక గంటన్నర సమయం దాటిన తరువాత తినవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. భోజనం ముగిసిన వెంటనే స్నానం చేయరాదు. అలా చేస్తే మన శరీరంలో రక్తం అన్ని భాగాలకు సరఫరా అవుతుంది. దీంతో జీర్ణాశయానికి రక్త సరఫరా తగ్గుతుంది. ఫలితంగా తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు. దీనికి తోడు గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తాయి.
భోజనం చేసిన వెంటనే చేయకూడని మరొక పని టీ, కాఫీ తాగడం. అవి అప్పుడు తాగితే జీర్ణాశయం పనితీరు దెబ్బ తింటుంది. అజీర్ణం, గ్యాస్, అసిడిటీ సమస్యలు ఉత్పన్నమవుతాయి. తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా గ్రహించలేదు. ఆహారం తీసుకున్న వెంటనే నిద్రించరాదు. అలా చేస్తే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. గ్యాస్ వస్తుంది. స్థూలకాయం సమస్య వస్తుంది. ఈత కొట్టడం, వ్యాయమం చేయడం, పనులు చేయడం వంటి వాటిని భోజనం చేశాక చేయరాదు. కనీసం 30 నుంచి 60 నిమిషాల గ్యాప్ తరువాతే ఆ పనులు చేయాలి. లేదంటే జీర్ణాశయంలో గ్యాస్ పెద్ద ఎత్తున పేరుకుపోతుంది. అది ఇబ్బందిని కలిగిస్తుంది.
చాలా మంది భోజనం చేశాక బెల్ట్ టైట్ అయిందని చెప్పి దాన్ని లూజ్ చేస్తారు. దీంతో సౌకర్యంగా ఉంటుందని అనుకుంటారు. కానీ అలా చేయరాదు. ఎందుకంటే అప్పటి వరకు టైట్గా ఉన్న పేగులు లూజ్ అయ్యే సరికి చుట్టుకున్నట్టు అవుతాయి. వాటి కదలిక సరిగ్గా ఉండదు. భోజనం చేసిన వెంటనే పొగ తాగరాదు. ఎందుకంటే మిగిలిన సమయాల్లోకన్నా భోజనం చేశాక ఒక సిగరెట్ తాగితే అది 10 సిగరెట్లకు సమానమట. కనుక ఆ పని చేయరాదు. ఇలా భోజనం అనంతరం పాటించే కొన్ని అలవాట్లను మానేయాల్సి ఉంటుంది. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…