Lord Shani Dev : మన సౌర వ్యవస్థలో 9 గ్రహాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. వీటినే నవగ్రహాలు అని వ్యవహరిస్తాం. ఈ క్రమంలో జ్యోతిష్య శాస్త్రం, పురాణాల ప్రకారం ఈ 9 గ్రహాలు మనుషుల జీవితాలను ప్రభావితం చేస్తాయని చెబుతారు. వాటి గమనాన్ని బట్టి వ్యక్తుల జాతకం మారుతూ ఉంటుంది. ఒక్కో గ్రహం ఒక్కో రకమైన ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా వారంలో ఉన్న 7 రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో గ్రహం అధిపతిగా ఉంటుంది (రాహు, కేతువులకు తప్ప). ఈ క్రమంలో శనిగ్రహం అధిపతిగా ఉన్న రోజు శనివారం. మరి ఆ రోజున ఎవరైనా ఏమేం పనులు చేయకూడదో, చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందామా.
వంకాయలు, నల్ల మిరియాలను శనివారం రోజున కొనకూడదు. అలాగే వాడకూడదు. వాడితే శనిగ్రహంతో సమస్యలు వచ్చి పడతాయట. ఆరోగ్యం బాగుండదట. సంపద హరించుకుపోతుందట. సాధారణంగా వ్యక్తులెవరూ మరొకరి చేతికి ఉప్పు ఇవ్వరు. కానీ శనివారం రోజున ఉప్పును ఎవరికైనా దానమివ్వవచ్చట తెలుసా. దీంతో సమస్యలు తొలగిపోతాయి. అయితే శనివారం రోజున ఉప్పును మాత్రం కొనకూడదు. కొంటే ఆర్థిక సమస్యలు వస్తాయట. శనివారం రోజున కొత్త వాహనాలను అస్సలు కొనకూడదు. అలాగే ఇనుప వస్తువులను కూడా కొనకూడదు. కొంటే ప్రమాదాల బారిన పడతారట. పండితులు కూడా ఇదే చెబుతారు. ఇనుప వస్తువులు కొనేందుకు శనివారం మంచిది కాదని వారు అంటారు.
మినప పప్పును శనివారం పూట కొనకూడదు. తినరాదు. కానీ దాన్ని ఆ రోజున వండి పేదలకు దానమివ్వవచ్చు. లేదంటే కాకులకు అయినా పెట్టవచ్చు. దీంతో శని సంతృప్తి చెందుతాడు. సత్ఫలితాలను ఇస్తాడు. నలుపు రంగు మీ ఫేవరెట్ కలరా. అయితే ఆ రంగు ఉన్న దుస్తులను మాత్రం శనివారం రోజున వేసుకోరాదు. అలా చేస్తే శనికి ఆగ్రహం వస్తుందట. అంతా అశుభమే కలుగుతుందట. శని సమస్యలను సృష్టిస్తాడట. ఆవాలను శనివారం పూట తినరాదు. అలాగే ఆవనూనెను కూడా. ఈ రెండింటినీ ఆ రోజున కొనరాదు కూడా. కానీ ఈ రెండింటితో చేసిన ఆహారాన్ని పేదలకు దానమివ్వవచ్చు. లేదంటే ఆవనూనెను శనివారం పూట శని విగ్రహంపై పోసి అభిషేకం చేయాలి. దీంతో శని సంతృప్తి చెంది మంచి ఫలితాలను ఇస్తాడట. చెక్క ఫర్నిచర్ను కూడా శనివారం పూట కొనకండి. ఒక వేళ ఆ రోజున వాటికి సంబంధించిన డెలివరీ వచ్చినా తీసుకోకండి. మరుసటి రోజు డెలివరీ తీసుకోండి. ఇలా చేస్తే శని సమస్యలను సృష్టించడు. అంతా మంచే చేస్తాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…