Curd In Winter : చలికాలంలో సహజంగానే చాలా మంది శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆహారాలను తింటుంటారు. ఈ క్రమంలోనే శరీరానికి చలువ చేసే ఆహారాలను ఈ సీజన్లో పక్కన పెడతారు. వాటిని తింటే జలుబు చేస్తుందని భావిస్తారు. అయితే చలువ చేసే ఆహారాలను చలికాలం తింటే జలుబు చేసే మాట వాస్తవమే అయినా వాటిల్లో కొన్ని ఆహారాలను మాత్రం చలికాలం అయినా సరే తినాల్సిందే. ఎందుకంటే ఇలాంటి ఆహారాలు కొన్ని మనకు చలికాలంలోనూ పలు ప్రయోజనాలను అందిస్తాయి. వాటిల్లో చెప్పుకోదగినది పెరుగు. అవును ఇదే. ఈ సీజన్లో పెరుగును చాలా మంది తినరు. కనీసం మజ్జిగ కూడా తాగరు. చలువ చేసి జలుబు చేస్తుందని ఈ సీజన్లో పెరుగును పక్కన పెడుతుంటారు. కానీ వాస్తవానికి పెరుగును చలికాలంలో తినాల్సిందే. దీంతో పలు ప్రయోజనాలను మనం పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చలికాలంలో పెరుగు తింటే ఎలా.. జలుబు చేస్తుంది కదా.. అంటే.. మనం దీన్ని మధ్యాహ్నం సమయంలో తినవచ్చు. రాత్రిపూట తినకపోయినా చలికాలంలో కనీసం మధ్యాహ్నం అయినా సరే పెరుగు తినాల్సిందే. దీంతో జలుబు చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పైగా పెరుగును తింటే చలికాలంలో పలు లాభాలను కూడా పొందవచ్చు. ఇక అవేమిటో ఇప్పుడు చూద్దాం. చలికాలంలో మన రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపిస్తుంది. సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఈ సీజన్లో మనం రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. అందుకు పెరుగు ఎంతగానో దోహదపడుతుంది. దీన్ని తినడం వల్ల జీర్ణాశయంలో ప్రోబయోటిక్స్ పెరుగుతాయి. ఇవి జీర్ణవ్యవస్థలో ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మన శరీర రోగ నిరోధక వ్యవస్థకు చెందిన దాదాపు 70 శాతం కణాలు జీర్ణవ్యవస్థలోనే ఉంటాయి. కనుక పెరుగును తింటే ఈ కణాలను పెంచుకోవచ్చు. దీంతో రోగనిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. ఫలితంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి.
ఇక ఈ సీజన్లో మనకు సూర్యరశ్మి కూడా సరిగ్గా లభించదు. ఫలితంగా విటమిడి సరిగ్గా తయారుకాదు. దీంతో ఎముకలు బలహీనంగా మారే అవకాశాలు ఉంటాయి. కానీ పెరుగును తింటే విటమిన్ డి లభిస్తుంది. ఇది ఎముకలను బలంగా ఉంచుతుంది. పైగా పెరుగులో కాల్షియం కూడా పుష్కలంగానే ఉంటుంది. ఇది కూడా ఎముకలు బలంగా మారేందుకు సహాయపడుతుంది. ఇలా పెరుగుతో ఎముకలను బలంగా ఉంచుకోవచ్చు. కనుక ఈ సీజన్లో పెరుగును తప్పక తినాలి.
చలికాలంలో జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. మలబద్దకం సమస్య వస్తుంది. కానీ పెరుగును ఆహారంలో భాగం చేసుకుంటే ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. మలబద్దకం ఉండదు. అలాగే పెరుగులో మన శరీరానికి అవసరం అయ్యే అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ప్రధానంగా పెరుగులో విటమిన్ బి12 ఉంటుంది. ఇది ఎర్ర రక్తకణాలు తయారు అయ్యేందుకు, నాడీ మండల వ్యవస్థ మెరుగ్గా పనిచేసేందుకు అవసరం అవుతుంది. కనుక పెరుగును తింటే ఇవన్నీ పొందవచ్చు. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. రోగాలు రాకుండా ఉంటాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…