Cracked Heels : శీతాకాలంలో చాలామంది చర్మం పాడైపోతుంది. చర్మం డ్రై అయిపోవడం, పాదాలకి పగుళ్లు రావడం. ఇలా, శీతాకాలంలో వచ్చే చర్మ సమస్యల్లో మడమల పగుళ్లు కూడా ఒకటి. చలి కారణంగా పాదాలకి పగుళ్లు వస్తుంటాయి. కొంతమందికి పాదాలు మంటలు, నొప్పులు కూడా వస్తూ ఉంటాయి. నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కువసేపు నిలబడడానికి కూడా కష్టంగా ఉంటుంది. అయితే, ఈ సమస్యతో మీరు కూడా సతమతమవుతున్నట్లయితే, ఈ ఇంటి చిట్కాలను పాటించడం మంచిది. ఇలా చేసినట్లయితే పగుళ్లు తగ్గిపోతాయి. పాదాలు అందంగా మారుతాయి.
రెండు స్పూన్లు ఆవాల నూనె తీసుకోండి. అలానే రెండు స్పూన్లు కొబ్బరి నూనె కూడా తీసుకోండి. కొద్దిగా వ్యాజిలిన్, విటమిన్ ఈ క్యాప్సిల్ ని కూడా పక్కన పెట్టుకోండి. చిన్న కర్పూరాన్ని కూడా తీసుకోండి. ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో రెండు స్పూన్లు ఆవాల నూనె, రెండు స్పూన్లు కొబ్బరి నూనె వేసుకోండి. తర్వాత కర్పూరాన్ని కూడా వేసుకుని మిక్స్ చేయండి. వ్యాజిలిన్, విటమిన్ ఈ క్యాప్సిల్ ని కూడా కలిపి పక్కన పెట్టుకోవాలి.
వీటన్నిటిని డబల్ బాయిలింగ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారాక, మడమలకు రాసుకుంటే అద్భుతమైన ఫలితం ఉంటుంది. గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే, నిల్వ ఉంటుంది. రోజు రాత్రి నిద్ర పోవడానికి ముందు దీన్ని మీ పాదాలకి రాసుకున్నట్లయితే, త్వరగా పగుళ్లు తగ్గిపోతాయి.
నొప్పులు వంటివి కూడా ఉండవు. వాపులు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. పగుళ్ల వలన చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. పగుళ్లు కోసం ఏవేవో క్రీములు ని కొనుగోలు చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే నచ్చిన నూనెలను రాసేస్తూ ఉంటారు. వీటన్నిటి వలన మీకు ఫలితం కనపడకపోయినట్లయితే, శీతాకాలంలో మడమల పగుళ్ళ నుండి బయటపడడానికి చిన్న చిట్కాని ట్రై చేయండి. సరిపోతుంది.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…