Calling Sahasra OTT Release : బిగ్ బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు హీరోగా సత్తా చాటుతున్నాడు. ఆయనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పలువురు నిర్మాతలు సుధీర్తో సినిమాలు చేసేందుకు తెగ ఆసక్తి చూపుతున్నారు. ఆయనతో రీసెంట్గా కాలింగ్ సహస్ర అనే సినిమా చేశారు.గాలోడు సక్సెస్ తర్వాత ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ తీసుకున్న సుడిగాలి సుధీర్ క్రైమ్ థ్రిల్లర్ కథతో ఈ చిత్రం చేశాడు. ఈ మూవీకి అరుణ్ విక్కీరాలా దర్శకత్వం వహించాడు. యానిమల్తో పాటు డిసెంబర్ 1న కాలింగ్ సహస్ర రిలీజైంది. అయితే యానిమల్ ఎఫెక్ట్ కాలింగ్ సహస్రపై భారీగానే పడింది. గాలోడు మ్యాజిక్ను రిపీట్ చేయలేక బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ డీలా పడింది.
థియేటర్ దగ్గర పెద్దగా సందడి చేయలేకపోయిన కాలింగ్ సహస్ర చిత్రం డిజిటల్ రైట్స్ను డిస్నీ ప్లస్ హాట్స్టార్ దక్కించుకున్నట్లు తెలిసింది. జనవరి 1న కాలింగ్ సహస్ర ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ అయితే రానుంది. సుధీర్కి బుల్లితెరతో పాటు వెండితెర ప్రేక్షకులలోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . ఈ క్రమంలో కాలింగ్ సహస్ర స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్స్టార్ భారీ ధరకు దక్కించుకున్నట్లు చెబుతున్నారు. ఇక ఈ చిత్రంలో డాలీషా హీరోయిన్గా నటించగా, శివబాలాజీ కీలక పాత్ర పోషించాడు.
చిత్ర కథ విషయానికి వస్తే.. అజయ్ శ్రీవాస్తవ (సుడిగాలి సుధీర్) ఓ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్. బెంగళూరు నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ మీద వస్తాడు. సిటీకి వచ్చిన తర్వాత ఓ కొత్త సిమ్ తీసుకుంటాడు. ఆ సిమ్ తీసుకున్న రోజు నుంచి అతడికి అనుకోని కాల్స్ వస్తూనే ఉంటాయి. అతని ఫోన్ నుంచి అతనికే మెసేజ్లు రావడం అతనికి ఏం అర్ధస్తుంది. ఆ మెసేజెస్ ఏంటి.. ఎక్కడ్నుంచి వస్తున్నాయి.. దాని కథేంటో తెలుసుకోవాలని వెళ్లి ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. అసలు ఈ కేసు ఏంటి, ఆ కేసు నుంచి ఎలా బయటపడ్డారు అనేది మిగిలిన కథ.
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…