RGV Vyooham : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు అద్భుతమైన సినిమాలు తీసి ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచాడు. కాని ఇటీవలి కాలంలో మాత్రం కాంట్రవర్సీ చిత్రాలు తీస్తూ హాట్ టాపిక్ అవుతున్నాడు. అయితే గత కొంతకాలంగా వర్మ జగన్కి అనుకూలంగా సినిమాలు చేస్తున్నాడు. వైసీపీ అధినేత సీఎం జగన్ రాజకీయ జీవిత ఆధారంగా రాంగోపాల్ వర్మ వ్యూహం, శపథం.సినిమాలు ప్రకటించడం తెలిసిందే. అయితే రామదూత క్రియేషన్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన ఈ సినిమాలలో మొదటి భాగం “వ్యూహం” నవంబర్ నెలలోనే విడుదల కావాల్సింది.కానీ ఆ సమయంలో సెన్సార్ పూర్తి కాలేదు.
అయితే తాజాగా “వ్యూహం” సినిమాకి సెన్సార్ పూర్తయినట్లు రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ కూడా చూపిస్తూ..డిసెంబర్ 29వ తారీకు “వ్యూహం” విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు. బ్యాడ్ న్యూస్ ఫర్ బ్యాడ్ గాయ్స్ అంటూ తనదైన శైలిలో పోస్టు పెట్టారు. చిత్రంలో దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత వైయస్ జగన్ జీవితంలో రాజకీయంగా చోటు చేసుకున్న సంఘటనలను ఈ సినిమాలో చూపించబోతున్నారు.రెండు భాగాలుగా రాంగోపాల్ వర్మ ఈ సినిమాని చేయడం జరిగింది. రామ్ గోపాల్ వర్మ ప్రకటనతో జగన్ అభిమానులు వైసీపీ పార్టీ కార్యకర్తలు కృషి అవుతున్నారు.
వ్యూహం చిత్రంలో వైఎస్ఆర్ మరణం అనంతరం పరిస్థితులు ఉలా ఏర్పడ్డాయి, జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది? జగన్ ఏపీ సీఎం ఎలా అయ్యారు? అనే కథాంశాలను చూపించబోతున్నాడు. తండ్రి మరణం తర్వాత తనకు ఎదురైన గడ్డు పరిస్థితులను సీఎం జగన్ అధిగమించిన తీరు, ముఖ్యమంత్రిగా ఎదిగిన విధానాన్ని శపథం సినిమాలో వర్మ ఆవిష్కరించనున్నట్లు సమాచారం. వ్యూహం సినిమాపై టీడీపీ నేతలతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. డైరెక్టర్ రామ్గోపాల్ వర్మకు హెచ్చరికలు కూడా జారీ చేశారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…