Constipation : చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్య నుండి బయటపడడానికి ఆరోగ్య నిపుణులు అద్భుతమైన చిట్కాలని చెప్పారు. వాటి గురించి ఇప్పుడు చూసేద్దాం. ఫ్రీగా మోషన్ అవ్వాలన్నా, మంచి బ్యాక్టీరియా పెరిగి మన రక్షణ వ్యవస్థని బాగా ఆరోగ్యంగా ఉంచాలన్నా ఇలా చేయాల్సిందే. మనం తీసుకున్న డైట్ లో కచ్చితంగా ఫైబర్ అధికంగా ఉండాలి. మనం డైట్ లో ఫైబర్ ని బాగా తీసుకుంటే మనకి సమస్యలు ఏమీ ఉండవు.
మలబద్దకం సమస్య నుండి దూరంగా ఉండవచ్చు. కచ్చితంగా మనం తినే ఆహారంలో 30 నుండి 40 గ్రాముల వరకు పీచు పదార్థాలు తప్పనిసరిగా ఉండాలి. ఆహారంలో పీచు లేకపోతే మలబద్ధకం వంటి ఇబ్బందులు కచ్చితంగా వస్తాయి. తొక్క తీసి కూరలు వండుకోవడం, పాలిష్ చేసిన బియ్యాన్ని వండుకోవడం ఇలాంటి తప్పులు మనం చేస్తుండడంతో పీచు బాగా తగ్గుతోంది.
పీచు పదార్థాలు ఆహారంలో లేకపోతే మలబద్ధకం వంటి సమస్యలు కచ్చితంగా వస్తాయి. పైగా పేగుల్లో ఇమ్యూనిటీ కూడా ఈ తప్పుల వలన తగ్గిపోతుంది. మలబద్ధకం వంటి ఇబ్బందులకు దూరంగా ఉండాలంటే, తీసుకునే డైట్ లో కొర్రలు, సామలు వంటివి తీసుకుంటే పీచు పదార్థాలు బాగా అందుతాయి. 100 గ్రాముల చియా సీడ్స్ ని తీసుకుంటే 34 గ్రాముల ఫైబర్ ని పొందొచ్చు. 30 గ్రాముల వరకు చియా సీడ్స్ ని తీసుకుని గంటన్నర సేపు నీళ్లలో వేసి వదిలేయండి.
ఇలా నానబెట్టిన చియా సీడ్స్ ని ఉపయోగిస్తే చక్కటి ఫలితం కనబడుతుంది. త్వరగా బయటపడిపోవచ్చు. పండ్లను ముక్కల కింద కోసి వాటి మీద నానబెట్టిన చియా సీడ్స్ ని వేసుకుని తీసుకుంటే సులభంగా మలబద్ధకం సమస్య నుండి బయట పడొచ్చు. మొలకలతోపాటు కానీ కూరగాయలతో పాటు కానీ చియా సీడ్స్ను తీసుకోవచ్చు. ఇలా మలబద్ధకం సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు. చిన్నారులకి, వృద్ధులకి కూడా వీటిని పెట్టొచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…