Boiled Egg : కోడిగుడ్లను ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. అవంటే చాలా మందికి ఇష్టమే. కొందరు వాటిని ఉడకబెట్టి తింటే ఇంకొందరు ఆమ్లెట్ వేసుకుని, ఇంకా కొందరు కూరగా చేసుకుని తింటారు. అయితే ఎవరు ఎలా తిన్నా ఉడకబెట్టిన గుడ్ల విషయంలో మాత్రం మనం ఓ విషయాన్ని గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అదేమిటంటే.. ఒక కోడిగుడ్డు ఉడికేందుకు మహా అయితే ఎంత సమయం పడుతుంది..? 10 లేదా 15 నిమిషాలు. అదీ.. మనం పెట్టే మంటను బట్టి కూడా ఉంటుంది. కానీ అసలు గుడ్డును సరిగ్గా ఎన్ని నిమిషాల పాటు ఉడికించి తింటే మంచిదో తెలుసా..? ఇదే విషయంపై జె. కెంజీ లోపెజ్- ఆల్ట్ అనే ఓ అమెరికన్ చెఫ్ ప్రయోగం చేశారు. ఆయన ఏం చెబుతున్నారంటే..
కోడిగుడ్డు తెల్ల సొన ఉడికేందుకు దాదాపుగా 82 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అవసరం. అదే దాని లోపల ఉన్న పచ్చ సొన ఉడికేందుకు మాత్రం అంత కన్నా తక్కువగా అంటే 76 డిగ్రీల సెంటీగ్రేడ్ మాత్రమే అవసరం అవుతుందని చెప్పారు. ఈ క్రమంలో గుడ్డును ఉడకబెట్టే కొద్దీ ఒక్కో నిమిషానికి అందులో వచ్చే మార్పులను ఆయన రికార్డ్ చేశారు. గుడ్డును ఉడకబెట్టినప్పుడు 1 నుంచి 3 నిమిషాలలో గుడ్డు ఇంకా పచ్చిగానే ఉంటుంది. కానీ పచ్చ సొన విడిపోయి ద్రవంగా మారుతుంది. తెల్లసొన అలాగే జిగురుగా ఉంటుంది.
5 నుంచి 7 నిమిషాల్లో గుడ్డు పచ్చ సొన గట్టిగా మారుతుంది. కానీ తెల్లసొన ఇంకా ద్రవంగానే ఉంటుంది. 9 నుంచి 11 నిమిషాల్లో పచ్చ సొన బాగా ఉడుకుతుంది. తెల్లసొన గట్టిగా మారుతుంది. జిడ్డుగా ఉంటుంది. 13 నుంచి 15 నిమిషాల్లో గుడ్డు బాగా ఉడుకుతుంది. తెల్ల, పచ్చ సొనలు రెండూ హార్డ్ బాయిల్ అవుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని సదరు చెఫ్ ఏమంటున్నారంటే.. ఒక కోడిగుడ్డును హార్డ్ బాయిల్ చేసేందుకు కనీసం 13 నిమిషాల సమయం పడుతుందట. అదీ ఎక్కువ మంట పెడితే 9 నిమిషాల్లోనే గుడ్డు ఉడుకుతుందని అంటున్నారు. కనుక హార్డ్ బాయిల్ ఎగ్ తినాలనుకునే వారు కనీసం 13 నిమిషాల పాటు దాన్ని ఉడికిస్తే చాలట. దీంతో కోడిగుడ్డు చక్కగా ఉడుకుతుంది. బాయిల్డ్ ఎగ్స్ విషయంలో ఈ సూచనలు పాటిస్తే గుడ్లు చక్కగా ఉడకడమే కాదు.. రుచిగా కూడా ఉంటాయి.
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…