Kids : చిన్నపిల్లలు అంటే ఎవరికైనా ఇష్టమే. తన, పర అనే భేదం లేకుండా చిన్నారులు ఎవరి వద్ద ఉన్నా ఇతరులు వారిని ఆప్యాయంగా పలకరిస్తారు. వీలుంటే చేతుల్లోకి తీసుకుని ఆడిస్తారు. ఇది ఎక్కడైనా జరిగిదే. అయితే అలా ఆడించే సమయంలో కొందరు చిన్నారులను ఎత్తుకుని అటూ ఇటూ షేక్ చేసినట్టు ఊపుతారు. అలాగే పసికందులను గాలిలో ఎగరేస్తూ ఆడిస్తారు. అయితే.. నిజానికి చిన్నారులను అలా చేయవచ్చా..? చేస్తే ఏమవుతుంది..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా చిన్నారులకే కాదు, పెద్దలకు కూడా తలను అలా అటు, ఇటు లేదా కిందకు, పైకి ఆడిస్తే తల తిరుగుతుంది. కొందరికి ఇలా చేస్తే పడదు. వాంతులు కూడా అవుతాయి. అలాంటిది చిన్నారులకు ఎలా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వారికి కూడా సరిగ్గా ఇలాగే జరుగుతుందట. దీంతో వారు దాన్ని తట్టుకోలేకపోతారట. ఆ క్రమంలో వారి మెదడుకు షాక్ తగిలే అవకాశం ఉంటుందట. సాధారణంగా చిన్నారుల మెదడు ఇంకా పూర్తి స్థాయిలో ఎదగదు కనుక మెదడు అంతా ఇటు, ఇటు తిరుగుతుందట. దీంతో వారికి బ్రెయిన్ షాక్ వచ్చేందుకు అవకాశం ఉంటుందట. ఈ స్థితిలో వారి మెదడులో రక్త స్రావం అయి మెదడు, వెన్నెముకకు నష్టం కలుగుతుందట.
ఈ క్రమంలో బ్రెయిన్ షాక్ వచ్చిన చిన్నారులు ఒక్క సారిగా స్పృహ కోల్పోయి ప్రాణాపాయ స్థితికి చేరుకుంటారట. అప్పుడు వారు చూడలేరు, మాట్లాడలేరు, నడవలేరట. దీంతో ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుందట. అయితే అంతటి ప్రాణాపాయ స్థితికి చేరుకోకున్నప్పటికీ చాలా మంది పిల్లలను ఇలా చేయడం వల్ల వారు సరిగ్గా ఎదగరట. అవయవాలు సరిగ్గా ఎదగవని సాక్షాత్తూ సైంటిస్టులు చేసిన పరిశోధనలే చెబుతున్నాయి. కనుక ఎవరైనా పిల్లలను దగ్గరకు తీసుకుంటే ఆడించండి. ముద్దు చేయండి. అంతేకానీ గాల్లోకి ఎగరేయడం, అటు, ఇటు ఊపడం వంటివి అస్సలు చేయరాదు. చేస్తే ఏమవుతుందో తెలుసు కదా. కాబట్టి ఈ విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సిందే. లేదంటే ప్రాణాల మీదకు తెచ్చినవారవుతారు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…