కరోనా నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రతి ఒక్కరూ యత్నిస్తున్నారు. అందులో భాగంగానే రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలను తీసుకుంటున్నారు. అయితే రోగ నిరోధక శక్తిని పెంచే రసం ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎండు మిరపకాయలు 2, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకులు 4-5 తీసుకుని మిక్సీలో వేసి పొడి చేయాలి. ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. కడాయి తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి. తరువాత అందులో తరిగిన టమాటాలు, మిగిలిన కరివేపాకులు, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి 3-4 నిమిషాల పాటు ఉడికించాలి. అంతకు ముందు సిద్ధం చేసిన మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. తరువాత అందులో చింత పండు గుజ్జు, 2 కప్పుల నీటిని పోయాలి. మూత పెట్టి సిమ్లో ఉంచి 10 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత ఇంకో పాత్ర తీసుకుని అందులో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి వేడిచేయాలి. వేడి అవగానే ఆవాలు, 1 ఎండు మిరపకాయ, ఇంగువ వేసి వేయించుకోవాలి. ఇంకో పాత్రలో ఉండే మిశ్రమాన్ని ఇందులో వేయాలి. స్టవ్ ఆర్పి కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేసుకోవాలి. రసం తయారవుతుంది. అందులో మిరియాల పొడిని చల్లుకోవాలి. దీన్ని అన్నంతో రోజూ మధ్యాహ్నం భోజనంలో తీసుకోవచ్చు. ఈ రసం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సాధారణ జలుబు, దగ్గు తగ్గుతాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…