కరోనా నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రతి ఒక్కరూ యత్నిస్తున్నారు. అందులో భాగంగానే రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలను తీసుకుంటున్నారు. అయితే రోగ నిరోధక శక్తిని పెంచే రసం ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎండు మిరపకాయలు 2, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకులు 4-5 తీసుకుని మిక్సీలో వేసి పొడి చేయాలి. ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. కడాయి తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి. తరువాత అందులో తరిగిన టమాటాలు, మిగిలిన కరివేపాకులు, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి 3-4 నిమిషాల పాటు ఉడికించాలి. అంతకు ముందు సిద్ధం చేసిన మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. తరువాత అందులో చింత పండు గుజ్జు, 2 కప్పుల నీటిని పోయాలి. మూత పెట్టి సిమ్లో ఉంచి 10 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత ఇంకో పాత్ర తీసుకుని అందులో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి వేడిచేయాలి. వేడి అవగానే ఆవాలు, 1 ఎండు మిరపకాయ, ఇంగువ వేసి వేయించుకోవాలి. ఇంకో పాత్రలో ఉండే మిశ్రమాన్ని ఇందులో వేయాలి. స్టవ్ ఆర్పి కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేసుకోవాలి. రసం తయారవుతుంది. అందులో మిరియాల పొడిని చల్లుకోవాలి. దీన్ని అన్నంతో రోజూ మధ్యాహ్నం భోజనంలో తీసుకోవచ్చు. ఈ రసం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సాధారణ జలుబు, దగ్గు తగ్గుతాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…