త్రిమూర్తులలో ఒకరైన ఆ పరమేశ్వరుడి ప్రతిరూపమే శివలింగం. భక్తి శ్రద్ధలతో ఆ పరమశివుడిని పూజిస్తే తప్పకుండా వారి కోరికలను నెరవేరుస్తాడు. అయితే ఆ పరమశివుడి ప్రతిరూపమైన శివలింగాన్ని పూజించేటప్పుడు కొన్ని నియమాలను పాటించడం వల్ల స్వామివారి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ క్రమంలోనే మనకు తెలియకుండా శివుడికి కొన్ని వస్తువులను సమర్పించడం వల్ల కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుందని పండితులు చెబుతున్నారు. మరి శివుడికి సమర్పించకూడని ఆ వస్తువులు ఏమిటో తెలుసుకుందామా..!
అన్ని పూజలలో మనం పసుపును ఉపయోగిస్తాము. కానీ శివపూజలో పసుపును ఉపయోగించకూడదు. పసుపు స్త్రీల అందాన్ని రెట్టింపు చేస్తుంది. కానీ శివలింగం పరమేశ్వరుడి ప్రతిరూపం కనుక శివపూజలో ఉపయోగించకూడదని శివపురాణం తెలుపుతోంది. శివ పూజలో పొరపాటున కూడా తులసి ఆకులను సమర్పించకూడదు. శివ పూజలో కేవలం మారేడు దళాలను మాత్రమే ఉపయోగించాలి.
కొబ్బరికాయను శివలింగం ముందు కొట్టవచ్చు కానీ ఆ కొబ్బరి నీళ్లను స్వామి వారిపై పోయకూడదు. పరమేశ్వరుడికి తెల్లటి పుష్పాలతో పూజ చేయడం వల్ల స్వామి వారు ఎంతో ప్రీతి చెందుతారు. కానీ చంపా పుష్పాలు తెలుపు రంగులో ఉన్నప్పటికీ స్వామి పూజకు అనర్హం. ఎందుకంటే చంపా పుష్పాలను శివుడు శపించడం వల్ల ఆయన పూజకు ఉపయోగించకూడదు. శివలింగానికి ఎప్పుడూ కుంకుమ తిలకం వాడకూడదు. ఈ విధమైన నిబంధనలను జాగ్రత్తగా పాటించి శివుడికి పూజ చేయడం వల్ల తప్పకుండా స్వామివారి అనుగ్రహం మనపై కలుగుతుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…