తాజా ఆకు కూరలలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి అన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఆకుకూరలను తినడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. మరి ఎన్నో పోషక విలువలు కలిగిన తోటకూర వేపుడు ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
*తాజా తోటకూర రెండు కట్టలు
*ఉల్లిపాయ ముక్కలు
*వెల్లుల్లి రెబ్బలు పది
*కారం టేబుల్ స్పూన్
*పసుపు చిటికెడు
*కొబ్బరి పొడి రెండు టేబుల్ స్పూన్లు
*పప్పుల పొడి రెండు టేబుల్ స్పూన్లు
*నూనె తగినంత
*శనగపప్పు 1 స్పూన్
*మినప్పప్పు 1 స్పూన్
*ఉప్పు తగినంత
*కొద్దిగా నీరు
ముందుగా తోటకూరను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తరువాత స్టవ్ మీద కడాయి ఉంచి కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడి అయిన తర్వాత పోపు దినుసులు, శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. ఇది కొద్దిగా ఎరుపు రంగులోకి రాగానే ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయలు ఎర్రపడ్డాక అందులోకి ముందుగా తరిగిపెట్టుకున్న తోట కూర వేసి బాగా కలియబెట్టాలి. కాసేపు మూత పెట్టి ఉడికించాలి. ఐదు నిమిషాల తర్వాత ఒక గ్లాస్ నీటిని వేసి తగినంత ఉప్పు వేసి మరోమారు కలియబెట్టి మూత పెట్టాలి. ఇలా చేయటంవల్ల ఆకు తొందరగా మెత్తబడుతుంది.ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కలియబెట్టి చిటికెడు పసుపు వేసి ఉడికించాలి.నీరు మొత్తం ఇంకిపోయిన తరువాత కారం వేసి సిమ్లో పెట్టుకుని రెండు నిమిషాలు వేయించాలి.కారం బాగా మగ్గిన తర్వాత కొద్దిగా కొబ్బరి పొడి, పప్పుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన తోటకూర వేపుడు తయారైనట్లే. ఈ తోటకూర వేపుడు చపాతీ పూరీ వంటివాటిలో తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…