తాజా ఆకు కూరలలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి అన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఆకుకూరలను తినడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. మరి ఎన్నో పోషక విలువలు కలిగిన తోటకూర వేపుడు ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
*తాజా తోటకూర రెండు కట్టలు
*ఉల్లిపాయ ముక్కలు
*వెల్లుల్లి రెబ్బలు పది
*కారం టేబుల్ స్పూన్
*పసుపు చిటికెడు
*కొబ్బరి పొడి రెండు టేబుల్ స్పూన్లు
*పప్పుల పొడి రెండు టేబుల్ స్పూన్లు
*నూనె తగినంత
*శనగపప్పు 1 స్పూన్
*మినప్పప్పు 1 స్పూన్
*ఉప్పు తగినంత
*కొద్దిగా నీరు
ముందుగా తోటకూరను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తరువాత స్టవ్ మీద కడాయి ఉంచి కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడి అయిన తర్వాత పోపు దినుసులు, శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. ఇది కొద్దిగా ఎరుపు రంగులోకి రాగానే ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయలు ఎర్రపడ్డాక అందులోకి ముందుగా తరిగిపెట్టుకున్న తోట కూర వేసి బాగా కలియబెట్టాలి. కాసేపు మూత పెట్టి ఉడికించాలి. ఐదు నిమిషాల తర్వాత ఒక గ్లాస్ నీటిని వేసి తగినంత ఉప్పు వేసి మరోమారు కలియబెట్టి మూత పెట్టాలి. ఇలా చేయటంవల్ల ఆకు తొందరగా మెత్తబడుతుంది.ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కలియబెట్టి చిటికెడు పసుపు వేసి ఉడికించాలి.నీరు మొత్తం ఇంకిపోయిన తరువాత కారం వేసి సిమ్లో పెట్టుకుని రెండు నిమిషాలు వేయించాలి.కారం బాగా మగ్గిన తర్వాత కొద్దిగా కొబ్బరి పొడి, పప్పుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన తోటకూర వేపుడు తయారైనట్లే. ఈ తోటకూర వేపుడు చపాతీ పూరీ వంటివాటిలో తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…