వేసవికాలం వచ్చిందంటే పచ్చిమామిడికాయలు తినడానికి ఎంతో ఇష్టపడతారు. ఈ క్రమంలోనే పచ్చి మామిడి కాయలతో తయారు చేసే పచ్చడి అంటే ప్రతి ఒక్కరు లొట్టలేసుకుంటూ తింటారు. ఎంతో రుచికరమైన పచ్చి మామిడికాయ పచ్చడి తయారు చేయడం ఏ విధంగానో ఇక్కడ తెలుసుకుందాం…
*పచ్చి మామిడికాయ ఒకటి
*నాలుగు ఎండుమిర్చి
*టేబుల్ స్పూన్ జీలకర్ర
*ఉప్పు తగినంత
*కరివేపాకు
*ఆవాలు
*వెల్లుల్లి రెబ్బలు
*ఉల్లిపాయ ముక్కలు
*నూనె
ముందుగా పచ్చి మామిడికాయను పైన తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టౌ పై కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి కరివేపాకు రెమ్మ జీలకర్ర 3 ఎండు మిరపకాయలు వేసి దోరగా వేయించాలి. మామిడికాయ ముక్కలు, వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని మిక్సీలో కాకుండా, రోటిలో మెత్తగా రుబ్బుకోవాలి.
మరొక కడాయిలో వేసి పోపు కోసం కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఆవాలు, కరివేపాకు, ఎండు మిర్చి ముక్కలు, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఆవాలు చిటపట అన్న తరువాత ముందుగా రుబ్బి పెట్టుకున్న మామిడికాయ పచ్చడిని ఆ కడాయిలో వేసి రెండు నిమిషాల పాటు సిమ్లో ఉడకనివ్వాలి. ఈ విధంగా మామిడికాయ పచ్చడిని ఉడికించడం వల్ల పచ్చి వాసన రాదు.రెండు నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్ చేస్తే ఎంతో రుచికరమైన మామిడికాయ పచ్చడి తయారైనట్లే.ఈ మామిడికాయ పచ్చడి వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే ప్లేట్ మొత్తం ఖాళీ చేయాల్సిందే.
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…
విటమిన్లు A, C, Eతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడే పపైన్ ఎంజైమ్తో బొప్పాయి ఎన్నో ఏళ్లుగా…
భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర నటుల మధ్య అల్లు అర్జున్ ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటున్నారు. పారితోషిక విషయంలో ఇతర తెలుగు…
టెలికాం దిగ్గజం జియో కుటుంబ వినియోగదారుల కోసం బడ్జెట్కు అనుకూలమైన కొత్త పోస్ట్పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.449…
2023లో జపాన్కు చెందిన ప్రముఖ మ్యాగజైన్ అనాన్ కవర్పై రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి దర్శనమిచ్చినప్పుడు అది తెలుగు…
హర్యానాలోని పానిపట్ రిఫైనరీ & పెట్రోకెమికల్ కాంప్లెక్స్లో అప్రెంటిస్ నియామకాలకు Indian Oil Corporation Limited (IOCL) కొత్త నోటిఫికేషన్…
మారుతి దర్శకత్వంలో ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ది రాజా సాబ్…