సాధారణంగా పాకంపప్పును వివిధ రకాల పదార్థాలతో తయారు చేసుకుంటారు.అయితే ఈ విధమైనటువంటి పాకంపప్పు ను వేరుశనగ విత్తనాల తో తయారు చేసుకొని తింటే తినడానికి ఎంతో రుచికరంగా ఉండటమే కాకుండా మన శరీరానికి ఐరన్ కూడా ఎంతో పుష్కలంగా లభిస్తుంది.మరి ఎంతో ఆరోగ్యకరమైన ఈ వేరుశనగ పాకంపప్పు ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
*వేరుశనగ విత్తనాలు అరకిలో
*బెల్లం రెండు కప్పులు
*నీళ్లు తగినన్ని
ముందుగా వేరుశనగ విత్తనాలను దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. విత్తనాలు చల్లారిన తర్వాత వాటిని పొట్టుతీసి శుభ్రం చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె ఉంచి మనం తీసుకున్న బెల్లంతో పాకం తయారు చేసుకోవాలి. చిన్న గ్లాసు నీటిని వేసి బెల్లం వేసి కలియబెడుతూ తీగ పాకం తయారు చేసుకోవాలి. తీగపాకం ఏర్పడిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకొన్న వేరుశనగ విత్తనాలను పాకంలో వేసి బాగా కలియ పెట్టుకుంటే ఎంతో రుచికరమైన, ఆరోగ్యవంతమైన వేరుశెనగ పాకంపప్పు తయారైనట్లే.
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…