సాధారణంగా పాకంపప్పును వివిధ రకాల పదార్థాలతో తయారు చేసుకుంటారు.అయితే ఈ విధమైనటువంటి పాకంపప్పు ను వేరుశనగ విత్తనాల తో తయారు చేసుకొని తింటే తినడానికి ఎంతో రుచికరంగా ఉండటమే కాకుండా మన శరీరానికి ఐరన్ కూడా ఎంతో పుష్కలంగా లభిస్తుంది.మరి ఎంతో ఆరోగ్యకరమైన ఈ వేరుశనగ పాకంపప్పు ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
*వేరుశనగ విత్తనాలు అరకిలో
*బెల్లం రెండు కప్పులు
*నీళ్లు తగినన్ని
ముందుగా వేరుశనగ విత్తనాలను దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. విత్తనాలు చల్లారిన తర్వాత వాటిని పొట్టుతీసి శుభ్రం చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె ఉంచి మనం తీసుకున్న బెల్లంతో పాకం తయారు చేసుకోవాలి. చిన్న గ్లాసు నీటిని వేసి బెల్లం వేసి కలియబెడుతూ తీగ పాకం తయారు చేసుకోవాలి. తీగపాకం ఏర్పడిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకొన్న వేరుశనగ విత్తనాలను పాకంలో వేసి బాగా కలియ పెట్టుకుంటే ఎంతో రుచికరమైన, ఆరోగ్యవంతమైన వేరుశెనగ పాకంపప్పు తయారైనట్లే.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…