మన దేశంలో దాదాపుగా ఎక్కడికి వెళ్లినా రైళ్లు, బస్సుల్లో సీట్లు నీలి రంగులో ఉంటాయి. అవును.. ఆయా వాహనాలు బయటకు ఏ రంగు ఉన్నా సరే సీట్ల రంగు మాత్రం నీలి రంగులోనే ఉంటుంది. సీట్లకు దాదాపుగా నీలి రంగునే వేస్తారు. అయితే ఇలా ఎందుకు వేస్తారో తెలుసా ? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
బస్సులు, ట్రైన్ ల లోపల ఉండే సీట్లు నీలి రంగులో ఉంటాయి. ఇలా నీలి రంగును ఎంపిక చేసుకోవడానికి కారణం శాస్త్రవేత్తల ప్రకారం మన మెదడు ఒక్కొక్క రంగుకు ఒక్కొక్క విధంగా రియాక్ట్ అవుతుంది. నీలిరంగు విషయానికి వస్తే నీలిరంగు మనకు రక్షణ, రిలాక్సేషన్ ను ఇస్తుంది.
అలాగే మనం ప్రయాణించే ముందు ఎక్కువ సేపు ట్రైన్, బస్సు కోసం వేచి ఉండటం, బస్సును, ట్రైన్ను మిస్ అవుతావని తొందర పడటం వంటివి జరుగుతూ ఉంటాయి. దీనివలన మనం ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతాం. ఈ క్రమంలో మనం బస్సులో లేదా ట్రైన్ లోకి వెళ్ళిన తర్వాత నీలిరంగు సీట్లను చూసి మనకు ప్రశాంతత కలుగుతుంది. అందువల్లే బస్సులు, ట్రైన్ లోపల ఉండే సీట్లు నీలిరంగులో ఉంటాయి. ఈ లాజిక్ను బేస్ చేసుకుని టోక్యో నగరంలో వీధి దీపాలను నీలి రంగులోకి మార్చారు. దీని కారణంగా అక్కడ క్రైమ్ రేటు కూడా చాలా తగ్గిందట. ఎందుకంటే తప్పు చేయాలనుకునే వ్యక్తుల మనస్తత్వాన్ని ఈ నీలిరంగు వీధి దీపాలు కొంతవరకు మార్చేస్తాయట. అందుకనే అక్కడ అలాంటి ఏర్పాటు చేశారు. అలాగే నీలిరంగు దీపాలు మొక్కల పెరుగుదలను కూడా వేగవంతం చేస్తాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. అందుకనే చాలా చోట్ల నీలి రంగును వాడడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం (మార్చి 11, 2026) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి…
నటి హన్సికా మోత్వాని, వ్యాపారవేత్త సోహైల్ కతూరియా నాలుగేళ్ల వివాహ జీవితానికి అధికారికంగా ముగింపు పలికారు. పరస్పర సమ్మతితో దాఖలు…