వారిద్దరూ మతాలు వేరైనా మనసులు కలిశాయి. పెద్దలను ఎదిరించి 14 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఎంతో ఆనందంగా సాగిపోతున్న వీరి జీవితంలో మనస్పర్థలు తలెత్తాయి. దీంతో తన భర్త ప్రవర్తనతో విసిగి పోయిన భార్య ఏకంగా తన భర్త పట్ల ఎంతో కఠినమైన నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రేమించిన భర్తనే దారుణంగా హత్య చేయించిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
నెల్లూరులోని జాకీర్ హుస్సేన్ నగర్లో ఈ నెల 22వ తేదీ జరిగిన ఎలక్ట్రీషియన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు సంబంధించిన నిందితులను మంగళవారం నవాబుపేట పోలీస్ స్టేషన్లో విలేకరుల ఎదుట హాజరుపరచిన డీఎస్పీ జే శ్రీనివాసులు అసలు విషయం బయట పెట్టాడు.జాకీర్ హుస్సేన్ నగర్కు చెందిన ఫయాజ్ (33), కల్యాణి ప్రేమించుకుని 2007లో వివాహం చేసుకున్నారు. ఫయాజ్ ఎలక్ట్రిషన్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునే వాడు.
అయితే ఈ మధ్య కాలంలో మద్యానికి బానిసైన ఫయాజ్ నిత్యం మందు తాగి భార్యతో గొడవలు పెట్టుకునేవాడు. దీంతో ఆర్థిక సమస్యలు అధికమవడంతో కళ్యాణి జాకీర్హుస్సేన్ నగర్కు చెందిన షేక్ అఫ్రోజ్ అలియాస్ కరిముల్లా వద్ద వడ్డీకి డబ్బులు అప్పుగా తీసుకుని పండ్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఈ క్రమంలోనే తన భర్త వేధింపులు భరించలేక కరీముల్లాతో మాట్లాడి తన భర్తను చంపడానికి ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే ఈనెల 22వ తేదీన మద్యం తాగి ఇంటికి చేరుకున్న ఫయాజ్ ను చంపాలని భావించారు. ఇదే విషయమే కరీముల్లాకు చెప్పి తను మార్కెట్ కు వెళ్లింది. ఈ క్రమంలోనే కరీముల్లా ఫయాజ్ ఇంటికి చేరుకొని అతనిపై దాడి చేసి అతనిని చంపినట్లు పోలీసులు తమ విచారణలో వెల్లడించారు.
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…