Spicy Guava Juice : జామ పండ్లని తీసుకోవడం వలన, అనేక లాభాలని పొందవచ్చు. జామలో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే, రెగ్యులర్ గా చాలా మంది జామ పండ్లుని తింటూ ఉంటారు. ఆరోగ్యంగా ఉండాలని అనుకునే వాళ్ళు, రోజు జామ పండ్లను తీసుకోవడం మంచిది. జామ పండ్లను తీసుకుంటే, వివిధ రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. పైగా, ఇవి మనకి అన్ని సీజన్స్ లో దొరుకుతాయి. కాబట్టి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తినవచ్చు. పెద్దగా ఇబ్బంది ఉండదు.
ఆరోగ్యంగా ఉండడానికి, రోజు పండ్లు ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తూ ఉంటారు. పండ్లు కానీ పండ్లు జ్యూస్ లని కానీ ఖచ్చితంగా తీసుకోవడం మంచిది. ముఖ్యంగా, షుగర్ ఉన్న వాళ్ళకి, జామ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. స్పైసీగా కూడా మనం జామ జ్యూస్ ని తయారు చేసుకోవచ్చు. ఇక జామ జ్యూస్ ని ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం. దీని కోసం మీరు రెండు జామ పండ్లను తీసుకోండి.
దానితో పాటు రెండు టేబుల్ స్పూన్లు చక్కెర, ఏడు వరకు పుదీనా ఆకులని తీసుకోండి. అలానే పింక్ సాల్ట్, జీలకర్ర పొడి, కారం, ఐస్ క్యూబ్స్ ని కూడా తీసుకోండి. పండిన జామ పండ్లను ముక్కలు కింద కోసుకుని, మిక్సీ జార్లో వేసుకోండి.
ఇందులో పంచదార, పుదీనా, పింక్ సాల్ట్, జీలకర్ర, కారం, ఐస్ క్యూబ్స్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గింజలు రాకుండా వడకట్టుకుని, ఒక గ్లాస్ లో పోసుకోండి. అర టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ చాట్ మసాలా వేసి పైన నిమ్మరసం పిండుకుని తాగితే, స్పైసీ గోవా జ్యూస్ అదిరిపోతుంది. కావాలంటే ఈసారి టేస్ట్ చేయండి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…