Spicy Guava Juice : జామ పండ్లని తీసుకోవడం వలన, అనేక లాభాలని పొందవచ్చు. జామలో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే, రెగ్యులర్ గా చాలా మంది జామ పండ్లుని తింటూ ఉంటారు. ఆరోగ్యంగా ఉండాలని అనుకునే వాళ్ళు, రోజు జామ పండ్లను తీసుకోవడం మంచిది. జామ పండ్లను తీసుకుంటే, వివిధ రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. పైగా, ఇవి మనకి అన్ని సీజన్స్ లో దొరుకుతాయి. కాబట్టి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తినవచ్చు. పెద్దగా ఇబ్బంది ఉండదు.
ఆరోగ్యంగా ఉండడానికి, రోజు పండ్లు ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తూ ఉంటారు. పండ్లు కానీ పండ్లు జ్యూస్ లని కానీ ఖచ్చితంగా తీసుకోవడం మంచిది. ముఖ్యంగా, షుగర్ ఉన్న వాళ్ళకి, జామ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. స్పైసీగా కూడా మనం జామ జ్యూస్ ని తయారు చేసుకోవచ్చు. ఇక జామ జ్యూస్ ని ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం. దీని కోసం మీరు రెండు జామ పండ్లను తీసుకోండి.
దానితో పాటు రెండు టేబుల్ స్పూన్లు చక్కెర, ఏడు వరకు పుదీనా ఆకులని తీసుకోండి. అలానే పింక్ సాల్ట్, జీలకర్ర పొడి, కారం, ఐస్ క్యూబ్స్ ని కూడా తీసుకోండి. పండిన జామ పండ్లను ముక్కలు కింద కోసుకుని, మిక్సీ జార్లో వేసుకోండి.
ఇందులో పంచదార, పుదీనా, పింక్ సాల్ట్, జీలకర్ర, కారం, ఐస్ క్యూబ్స్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గింజలు రాకుండా వడకట్టుకుని, ఒక గ్లాస్ లో పోసుకోండి. అర టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ చాట్ మసాలా వేసి పైన నిమ్మరసం పిండుకుని తాగితే, స్పైసీ గోవా జ్యూస్ అదిరిపోతుంది. కావాలంటే ఈసారి టేస్ట్ చేయండి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…