Ragi Dosa : రాగులలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వారంలో మూడు సార్లు రాగులను ఆహారంలో బాగంగా చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. రాగి పిండితో దోశ వేసుకొని తినవచ్చు. రాగి దోశ ఎలా తయారుచేయాలో చూద్దాం. ఒక గిన్నెలో ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు బియ్యం పిండి, అరకప్పు బొంబాయి రవ్వ వేయాలి. ఆ తర్వాత చిన్న ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత రెండు పచ్చిమిర్చి, అంగుళం అల్లం ముక్కను ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, సరిపడా ఉప్పు, కొత్తిమీర, అరకప్పు పెరుగు, సరిపడా నీటిని పోసి దోశల పిండి మాదిరిగా కలుపుకోవాలి.
దోశ పిండిలా కలిపిన తరువాత పిండిని అరగంట పాటు అలా వదిలేయాలి. తరువాత పెనంపై దోశలు వేసుకోవాలి. దీంతో ఎంతో రుచికరమైన రాగి దోశలు రెడీ అవుతాయి. వీటిని వారంలో రెండు మూడు సార్లు తినవచ్చు. ఓపిక ఉంది అనుకుంటే రోజూ వీటినే బ్రేక్ ఫాస్ట్ లా తినవచ్చు. దీంతో ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా రక్తహీనత ఉన్నవారికి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య నుండి బయట పడేస్తాయి. అలాగే కీళ్లనొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారికి కూడా చాలా మేలు చేస్తాయి.
ఈ దోశలను తినడం వల్ల డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. అధిక బరువు తగ్గుతారు. కొలెస్ట్రాల్ ఉండదు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్లు రావు. ఇలా రాగి పిండితో దోశలను వేసుకుని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే పోషకాలు కూడా లభిస్తాయి. ఇక మనకు మార్కెట్లో రాగి పిండి లభిస్తుంది. లేదా రాగులను కొని శుభ్రం చేసి మనమైనా వాటిని పిండిలా పట్టించుకోవచ్చు. ఇలా రాగి దోశలు మాత్రమే కాకుండా రాగి జావ, రాగి రొట్టె వంటివి కూడా చేసుకుని తినవచ్చు. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…