Ragi Dosa : రాగులలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వారంలో మూడు సార్లు రాగులను ఆహారంలో బాగంగా చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. రాగి పిండితో దోశ వేసుకొని తినవచ్చు. రాగి దోశ ఎలా తయారుచేయాలో చూద్దాం. ఒక గిన్నెలో ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు బియ్యం పిండి, అరకప్పు బొంబాయి రవ్వ వేయాలి. ఆ తర్వాత చిన్న ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత రెండు పచ్చిమిర్చి, అంగుళం అల్లం ముక్కను ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, సరిపడా ఉప్పు, కొత్తిమీర, అరకప్పు పెరుగు, సరిపడా నీటిని పోసి దోశల పిండి మాదిరిగా కలుపుకోవాలి.
దోశ పిండిలా కలిపిన తరువాత పిండిని అరగంట పాటు అలా వదిలేయాలి. తరువాత పెనంపై దోశలు వేసుకోవాలి. దీంతో ఎంతో రుచికరమైన రాగి దోశలు రెడీ అవుతాయి. వీటిని వారంలో రెండు మూడు సార్లు తినవచ్చు. ఓపిక ఉంది అనుకుంటే రోజూ వీటినే బ్రేక్ ఫాస్ట్ లా తినవచ్చు. దీంతో ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా రక్తహీనత ఉన్నవారికి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య నుండి బయట పడేస్తాయి. అలాగే కీళ్లనొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారికి కూడా చాలా మేలు చేస్తాయి.
ఈ దోశలను తినడం వల్ల డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. అధిక బరువు తగ్గుతారు. కొలెస్ట్రాల్ ఉండదు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్లు రావు. ఇలా రాగి పిండితో దోశలను వేసుకుని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే పోషకాలు కూడా లభిస్తాయి. ఇక మనకు మార్కెట్లో రాగి పిండి లభిస్తుంది. లేదా రాగులను కొని శుభ్రం చేసి మనమైనా వాటిని పిండిలా పట్టించుకోవచ్చు. ఇలా రాగి దోశలు మాత్రమే కాకుండా రాగి జావ, రాగి రొట్టె వంటివి కూడా చేసుకుని తినవచ్చు. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…