కరోనా నేపథ్యంలో ఇప్పటికే అనేక రంగాల్లో కొన్ని కోట్ల మంది ఉద్యోగాలను, ఉపాధిని కోల్పోయారు. అయితే ఇది చాలదన్నట్లు బ్యాంక్ ఆఫ్ అమెరికా ఓ షాకింగ్ విషయం వెల్లడించింది. 2022 వరకు దేశంలో ఐటీ రంగంలో 30 లక్షల మంది ఉద్యోగాలను కోల్పోతారని తెలిపింది. దేశంలో ప్రస్తుతం 1.60 కోట్ల మంది ఉద్యోగులు ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. వారిలో 30 లక్షల మంది మరో ఏడాది కాలంలో ఉద్యోగాలను కోల్పోతారని వెల్లడైంది.
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆటోమేషన్ విస్తరిస్తోంది. మనుషులు చేయాల్సిన చాలా పనులను రోబోలే చేస్తున్నాయి. ఇక ఐటీ రంగంలోనూ ఆటోమేషన్ సంచనాలను సృష్టిస్తోంది. దీని వల్లే రానున్న ఏడాది కాలంలో ఏకంగా 30 లక్షల మంది ఉద్యోగాలను కోల్పోతారని తెలిసింది. ఈ క్రమంలో సాఫ్ట్వేర్ కంపెనీలకు రూ.7.30 లక్షల కోట్లు ఆదా అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కోవిడ్ కారణంగా అనేక మంది ఉద్యోగాలను కోల్పోగా ఈ వార్త ఐటీ ఉద్యోగులకు షాక్నిచ్చింది.
కాగా కోవిడ్ నేపథ్యంలో యువత, వయస్సు పైబడిన వారు ఉద్యోగాలను ఎక్కువగా కోల్పోయారని ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ ఎఫ్ఐఎస్ చేపట్టిన తాజా సర్వేలో వెల్లడైంది. 55 ఏళ్లకు పైబడిన వారిలో 6 శాతం మంది, 24 ఏళ్ల లోపు వారిలో 11 శాతం మంది కోవిడ్ కారణంగా ఉద్యోగాలను కోల్పోయారు. అయితే మరో ఏడాదిలో అంత భారీ సంఖ్యలో ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోనుండడం సంచలనం కలిగిస్తోంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…