దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. మొదట్లో వ్యాక్సిన్ వేసుకోవడానికి ప్రజలు వెనకడుగు వేసిన ప్రస్తుతం తీసుకోవడానికి ఆసక్తి చూపడంతో కొరత ఏర్పడింది. ఈ క్రమంలోనే కొందరు మొదటి డోస్ వేయించుకొని రెండవ డోసు అందుబాటులో లేకపోవడం వల్ల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా మరికొందరు నిర్లక్ష్యం వల్ల రెండవ డోసు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు.ఈ విధంగా ఒక డోస్ తీసుకుని రెండవ డోసు తీసుకోకపోతే ఏం జరుగుతుంది? ఒక డోస్ తీసుకోవటం వల్ల ఏవైనా ప్రమాదాలు తలెత్తుతాయా అనే సందేహం చాలా మందిలో కలుగుతున్నాయి.
అయితే ప్రస్తుతం మనదేశంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేస్తోన్న కోవిషీల్డ్,భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్లను ప్రజలకు అందిస్తున్నారు. ఈ రెండింటిలో కోవిషీల్డ్ అధిక సామర్థ్యంతో పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ లు మొదటి డోసు వేయించుకున్న తరువాత తప్పనిసరిగా నాలుగవ వారం నుంచి 12 వారాల వ్యవధిలో రెండవ డోసు తప్పనిసరిగా తీసుకోవాలి.
మొదటి డోసు వేసుకొని రెండవ డోస్ మిస్సయితే మీరు వైరస్ నుంచి రక్షించబడలేరని.. వైరాలజిస్ట్ డాక్టర్ జాకబ్ జాన్ చెప్పారు.రెండవ డోసు వేసుకోకపోతే మీరు వ్యాధి బారిన పడటమేకాకుండా వ్యాధి తీవ్రత అధికంగా అవుతుందని డాక్టర్ జాకబ్ జాన్ తెలిపారు. రెండు డోసులు వ్యాక్సిన్ పూర్తి మోతాదులో తీసుకున్నప్పుడే ప్రయోజనం ఉంటుందని.మొదటి డోసు ఇన్ఫెక్షన్ రేటు తగ్గించిన రెండవ డోసు 90% వైరస్ సంక్రమించకుండా రక్షిస్తుందని డాక్టర్ జాన్ తెలిపారు. కనుక రెండవ డోసు నిర్దిష్ట సమయం కన్నా ఎక్కువైనా తప్పకుండా వేయించుకోవాలని సూచించారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…