మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో నివాసం ఉండే రాణి, సంకల్ప్ పరిహార్ దంపతులు కొన్నేళ్ల కిందట రెండు మామిడి మొక్కలను నాటారు. అవి ఇతర మామిడి మొక్కల్లాగే పెరిగి పెద్దగయ్యాయి. కాయలు కూడా కాశాయి. అవి రూబీ కలర్లో ఉండడం విశేషం. అయితే ఆ మామిడి పండ్లు జపాన్కు చెందిన అత్యంత అరుదైన జాతికి చెందిన మియాజకి అనే మామిడి వెరైటీకి చెందినవని వారు తరువాత గుర్తించారు.
అంతర్జాతీయ మార్కెట్లో మియాజకి మామిడి పండ్లను అత్యంత ఎక్కువ ధర పలుకుతుంది. కేజీకి సుమారుగా రూ.2.70 లక్షల ధర పలుకుతాయి. ఎందుకంటే ఈ మామిడి పండ్లు చాలా తక్కువ సంఖ్యలో పండుతాయి. రుచి చాలా తియ్యగా ఉంటాయి. అందుకనే వీటికి అంత ఖరీదు ఉంటుంది.
అయితే గతేడాది ఈ మామిడి పండ్లు కాశాక కొందరు దొంగలు కాయలను దొంగిలించారు. దీంతో ఆ దంపతులు ఈసారి తోటలో ఆరు కుక్కలు, నలుగురు సెక్యూరిటీ గార్డులను కాపలా పెట్టారు. వారు ఆ మామిడి చెట్లను, కాయలను కాపలా కాస్తున్నారు.
ఇక ఆ మామిడి పండ్లకు ఎంత రేటైనా సరే చెల్లించేందుకు కొందరు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఆ దంపతులు మాత్రం వాటిని తాము ఇప్పుడే అమ్మబోమని, వాటితో మరిన్ని చెట్లను పెంచుతామని చెబుతున్నారు. ఇక సైంటిస్టులు ఆ అరుదైన జాతికి చెందిన మామిడి పండ్లను పరిశీలించేందుకు అక్కడికి వెళ్తున్నారు.
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం హైబీపీ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కొందరికి…
UCO Bank Recruitment 2026 | యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (యూసీఓ బ్యాంక్) 2026 సంవత్సరానికి భారీ నియామక ప్రకటనను…
QR Code On Aadhar | కేంద్ర, రాష్ట్ర ప్రయోజనాలను పొందడంతో పాటు దేశంలోని పౌరులకి ఆధార్ కార్డు అత్యంత…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…