Pesticides On Vegetables : కూరగాయలు, ఆకుకూరలు మనం నిత్యం తీసుకునే ఆహార పదార్థాలలో ఒక భాగం. అధిక దిగుబడి కోసం ప్రస్తుతం రసాయన ఎరువుల వాడకం ఎక్కువయింది. కూరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలని కూడా రకరకాల కెమికల్స్ వాడుతుంటారు. వాటిని డైరెక్ట్ గా తీసుకుంటే అనేక దుష్పరిమాణాలు కలుగుతాయి. అలా కాకుండా కూరగాయలపై ఉండే రసాయనాలను క్లీన్ చేయడానికి పలు మార్గాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మనలో చాలామంది చల్లని నీటిలో కూరగాయలను వేసి కడుగుతారు. చల్లని నీటిలో వేసినప్పటికీ వాటిని బాగా రుద్దితేనే కూరగాయలపై ఉన్న రసాయనాలను తొలగించగలుగుతాం. కూరగాయలపై ఉండే రసాయనాలను క్లీన్ చేయడానికి ఉప్పు నీరు మనకు చాలా ఉపయోగపడుతుంది. గోరువెచ్చని నీటిలో రెండు టీస్పూన్ల ఉప్పు వేసి అరగంట పాటు కూరగాయలను అందులో వేసి ఆ తర్వాత వాడుకుంటే రసాయనాలు సమూలంగా తొలగిపోతాయి. కూరగాయలపై రసాయనాలను తొలగించడానికి వెనిగర్ బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం మీరు చేయాల్సింది ఒక కప్ వెనిగర్ చేర్చి ఆ వాటర్ లో కూరగాయలు నానబెట్టి అరగంటయ్యాక వాడుకోవాలి.
ఎక్కువ టైం లేని వాళ్లు ఒక టీస్పూన్ నిమ్మరసం, రెండు టీస్పూన్ల వెనిగర్, ఒక కప్ వాటర్ లో కలుపుకుని స్ప్రే బాటిల్ ల్ నింపుకోవాలి. కూరగాయలు కట్ చేసుకునే ముందు ఆ మిశ్రమాన్ని కూరగాయలపై స్ప్రే చేసి వెంటనే కట్ చేసుకోవచ్చు. పండ్లు కానీ, కూరగాయలకు కానీ పైన తొక్క తీసి వాడుకోవడం చాలా ఉత్తమమైన మార్గం. కానీ అన్నింటినీ అలా వాడుకోవడం అనేది సాధ్యం కాదు. అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా కూరగాయలు లేదా ఆకుకూరలు, పండ్లు ఏవైనా సరే బాగా కడిగిన తరువాతే తినడం శ్రేయస్కరం. లేదంటే రసాయనాల బారిన పడి మనం తీవ్ర పరిమాణాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక వాటిని తప్పనిసరిగా బాగా శుభ్రం చేయాల్సి ఉంటుంది.
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22…
నటీనటులు డబ్బు బాగా సంపాదించడం ఒకెత్తు అయితే దాన్ని పొదుపు చేయడం మరో ఎత్తు అని, సరైన సమయంలో డబ్బును…