ప్రస్తుత కాలంలో మన ఒంట్లో కొంచెం నలతగా ఉంటే చాలు వెంటనే ఇంగ్లీష్ మందులను వేసుకుని ఉపశమనం పొందుతాము. అయితే ఆ ఉపశమనం కేవలం తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తుంది. కానీ ఈ విధంగా తరచు మనం అనారోగ్యానికి గురి కాకుండా శాశ్వతంగా అనారోగ్యాన్ని తగ్గించే ఔషధ గుణాలు మన వంటింట్లోనే ఉన్నాయనే విషయం మర్చిపోయారు. అయితే కరోనా ప్రభావం వల్ల చాలామంది మన వంటింట్లో దొరికే మసాలా దినుసులతో ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. మన వంటింట్లో దొరికే మసాలా దినుసులలో ఉన్న ఔషధ గుణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
* పసుపు: పసుపు ఎన్నో ఔషధ గుణాల నిలయం అని చెప్పవచ్చు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉన్నాయి.ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని పాలలో పసుపు కలుపుకుని తాగడం ద్వారా మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.
* మిరియాలు: ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా మిరియాలు వేసి బాగా మరిగించాలి. ఈ మిరియాలతో పాటు కొద్దిగా పసుపు, తులసి ఆకులను వేయడం ద్వారా వాటిలో ఉన్న పోషకాలు నీటి ద్వారా మన శరీరంలోనికి గ్రహించబడి మనకు రోగనిరోధక శక్తిని అందిస్తాయి.
* మన వంటింట్లో దొరికే వాము, జీలకర్ర, మెంతులు వంటి దినుసులు జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. అదేవిధంగా మన శరీరానికి ఒత్తిడిని తగ్గించే హార్మోన్ లను విడుదల చేయడంలో దోహదపడతాయి. ఈ విధమైన మసాలాదినుసులన్నింటినీ కలిపి బాగా మరిగించి కషాయం తయారుచేసుకొని ప్రతి రోజూ ఒక గ్లాస్ తాగటం ద్వారా రోగనిరోధకశక్తిని పెంపొందించుకోవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…