దేశ వ్యాప్తంగా కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. మరో 2 నెలల్లో దేశంలో 44 కోట్ల డోసులు సిద్ధం చేస్తామని కేంద్రం ఇప్పటికే చెప్పింది. ఈ నెల 21వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు పైబడిన అందరికీ టీకాలను ఉచితంగా అందిస్తామని కూడా కేంద్రం వెల్లడించింది. అయితే టీకాలను తీసుకోవడంలో చాలా మందికి సందేహాలు వస్తున్నాయి. వాటిల్లో సహజంగానే చాలా మందికి వస్తున్న సందేహం.. కోవిడ్ టీకా తీసుకుంటానికి ముందు, తరువాత మద్యం సేవించవచ్చా ? అని.. అయితే ఇందుకు వైద్య నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారంటే..
కోవిడ్ వ్యాక్సిన్కు ముందు లేదా తరువాత ఎప్పుడైనా సరే ఆల్కహాల్ను సేవిస్తే దాని ప్రభావం టీకాపై ఉండదు. ఆల్కహాల్ ప్రభావం యాంటీ బాడీల ఉత్పత్తిపై పడదు. కనుక ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఇదే విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖతోపాటు అమెరికాకు చెందిన సీడీసీ కూడా వెల్లడించింది. వ్యాక్సిన్లపై ఆల్కహాల్ ఎలాంటి ప్రభావం చూపించదని తేల్చారు.
ఇక కోవిడ్ టీకాలపై ఆల్కహాల్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే విషయాన్ని తయారీ సంస్థలే వెల్లడించలేదు. సాధారణంగా ఇంగ్లిష్ మందులను వాడేటప్పుడు ఆల్కహాల్ను సేవించకూడదని, లేదంటే రియాక్షన్లు వస్తాయని చెబుతారు. కానీ కోవిడ్ టీకాల విషయంలో వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు కూడా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. మరోవైపు యూకేకు చెందిన మెడిసిన్స్ అండ్ హెల్త్కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఏ) కూడా కోవిడ్ టీకాలపై ఆల్కహాల్ ప్రభావం చూపించదనే చెప్పింది. కనుక ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని నిపుణులు సూచిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…