ప్రస్తుతం టాలీవుడ్ హీరో ప్రభాస్ పాన్ ఇండియన్ స్థాయిలో ఏ విధమైన గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రస్తుతం ప్రభాస్ నటించిన సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కడం విశేషం. ఈ క్రమంలోనే ప్రభాస్, పూజా హెగ్డే జంటగా జిల్ ఫేమ్ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన “రాధేశ్యామ్” చిత్రం గురించి మనకు తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ కరోనా ప్రభావంతో వాయిదా పడింది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలోవైరల్ గా మారడంతో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమా విడుదల విషయానికి వస్తే ఇప్పట్లో థియేటర్లో తెరుసుకునే అవకాశం లేకపోవడంతో ఈ సినిమాను ఓటీటీ విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా హక్కులకోసం 400 కోట్ల డీల్ నిర్మాతల ముందు పెట్టినట్టు తెలుస్తోంది.
గతంలో ఈ సినిమా కోసం పలు ఓటీటీ సంస్థలు పోటీపడ్డాయి ఈక్రమంలోనే నెట్ఫ్లిక్స్ ఏకంగా 300 కోట్లు ఆఫర్ చేయగా… ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ 400 కోట్ల ఆఫర్ ప్రకటించింది. ఈ విధమైనటువంటి భారీ ఆఫర్ ప్రకటించడంతో నిర్మాతలు ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తారా? లేక థియేటర్లలో విడుదల చేస్తారనే విషయం మరి కొద్ది రోజులలో తెలియనుంది.
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…