Acharya Chanakya : సమాజంలోని అందరితో మనం కలసి మెలసి ఉండాలనే అనుకుంటాం. ఆ ప్రకారంగానే మనం చేసే పనులు కూడా ఉంటాయి. అయితే అనుకోకుండా అప్పుడప్పుడు కొందరు మనకు శత్రువులుగా కూడా మారుతుంటారు. కానీ కొందరైతే అదే పనిగా వివిధ పనులు చేస్తూ అందరితోనూ శత్రుత్వం పెంచుకుంటూ ఉంటారు. అయితే ఎలా ఏర్పడినా శత్రువులు అంటూ తయారయ్యాక వారిని లేకుండా చేసుకోవడమే పనిగా పెట్టుకోకూడదు. ఆచితూచి అడుగేయాలి. సందర్భం వచ్చినప్పుడు చెక్ పెట్టాలి. ఈ క్రమంలో శత్రువుల పట్ల ఎలా ప్రవర్తించాలో ఆచార్య చాణక్యుడు మనకు చెప్పాడు. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
శత్రువులను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు. వారిని మన కన్నా ఎక్కువగానే ఊహించుకుని అడుగు ముందుకు వేయాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది. తెలివిమంతులు ఎవరూ నేరుగా శత్రువులను అటాక్ చేయరు. శత్రువులకు చెందిన ఒక్కో స్టెప్ను తెలుసుకుంటూ ఆచి తూచి ప్రవర్తిస్తారు. శత్రువు బలం, బలహీనతలను గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. అనంతరం వారిని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. దాన్ని విశ్లేషించాలి. అప్పుడే అడుగు ముందుకు వేయాలి. శత్రువుకు ఉన్న నైపుణ్యం, మనకు ఉన్న నైపుణ్యాలను బేరీజు వేసుకోవాలి. శత్రువును ఎలా అటాక్ చేస్తామో ముందుగానే రిహార్సల్ చేసుకుని ఓ అంచనాకు రావాలి. అప్పుడే ప్రణాళిక రచించాలి. దాన్ని అమలు చేయాలి.
ఎంత పెద్ద శత్రువును ఢీకొనే ముందు అయినా ప్రశాంతంగా ఉండాలి. అనుకోని పరిస్థితులు ఎదురైతే ఎలా స్పందించాలో తెలిసుండాలి. దాని ప్రకారం మెదడు వాడుతూ ముందుకు సాగాలి. శత్రువును బలంగా దెబ్బ కొట్టాలంటే బలమైన శరీరం ఉండాల్సిన పనిలేదు. బుద్ధి బలం ఉన్నా చాలు. శత్రువును ఎప్పుడూ ద్వేషించకూడదు. ఆటలో అతన్ని ఒక ప్రత్యర్థిగా చూడాలి. అప్పుడే విజయం కలుగుతుంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…