Ravi Chettu Puja : మన దేశంలో ఉన్న ఏ ఆలయంలోకి వెళ్లినా అక్కడ రావి చెట్టు కచ్చితంగా ఉంటుందని అందరికీ తెలిసిందే. ఆ చెట్టును దైవానికి ప్రతిరూపంగా భావిస్తారు. ఆ చెట్టు వేర్లలో బ్రహ్మ, కాండంలో విష్ణువు, ఆకుల్లో శివుడు ఉంటాడట. అందుకే రావి చెట్టును భక్తులు పూజిస్తారు. ఈ క్రమంలో రావి చెట్టు వల్ల మనకు ఆయుర్వేద పరంగా ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. అయితే రావి చెట్టును భక్తులు అంత నమ్మకంగా పూజించడానికి గల పలు కారణాలు తెలుసుకుందాం. వాటిలో పురాణాల ప్రకారం కొన్ని ఉంటే, సైంటిఫిక్ పరంగా ఓ కారణం ఉంది. అవేమిటంటే..
పైనే చెప్పాం కదా. రావి చెట్టు వేర్లలో బ్రహ్మ, కాండంలో విష్ణువు, ఆకుల్లో శివుడు ఉంటాడని. దీన్ని గురించి శ్రీకృష్ణుడు చెప్పాడట. ఇదే విషయం భగవద్గీతలో కూడా ఉందట. అందుకే భక్తులు రావి చెట్టును పూజిస్తున్నారు. సకల దేవుళ్లు, దేవతలు రావి చెట్టులో కొలువై ఉంటారట. అందు వల్లనే ఆ చెట్టును దైవంగా భావించి పూజిస్తున్నారు. జంతువులు, పక్షులు, చెట్లు, ప్రాణులు అన్నీ రావి చెట్టులోనే పుట్టాయట. అందువల్ల కూడా భక్తులు ఆ చెట్టును పవిత్రంగా భావిస్తారు. రావి చెట్టుకు నీరు పోసి పూజ చేస్తే ధనం సిద్ధిస్తుందట. అనారోగ్యం నయమవుతుందట. కాల సర్ప దోషం పోతుందట. అందుకే ఆ చెట్టును అందరూ పూజిస్తారు.
రావి చెట్టు కింద కూర్చుని హనుమాన్ చాలీసా చదివితే సమస్యలన్నీ పోతాయట. ప్రతి రోజూ ఆ చెట్టు కింద కూర్చుని కొంత సేపు దైవాన్ని ప్రార్థిస్తే అలాంటి వారికి ఎలాంటి సమస్యలు రావట. రావి చెట్టు కింద రోజూ ఆవ నూనెతో దీపాన్ని వెలిగిస్తే మంచిదట. అంతా శుభమే జరుగుతుందట. రావి చెట్టు కింద పడుకుని నిద్రిస్తే ఆ చెట్టు నుంచి వచ్చే గాలికి ఎన్నో అనారోగ్య సమస్యలు నయమవుతాయట. అందుకనే ఆ చెట్టును పవిత్రంగా భావించి పూజలు చేస్తారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…