కరోనా ఏమోగానీ సోషల్ మీడియాలో లెక్కలేనన్ని ఫేక్ వార్తలు రోజూ విపరీతంగా ప్రచారం అవుతున్నాయి. అసలు సోషల్ ప్లాట్ఫాంలలో వస్తున్న వార్తలను నమ్మాలో, లేదో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతోంది. కోవిడ్ బాధితులు నల్ల మిరియాలు, అల్లం, తేనెలను తీసుకుంటే కరోనా త్వరగా తగ్గుతుందని ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది.
అయితే సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఆ వార్తలో ఎంత మాత్రం నిజంలేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) తన ఫ్యాక్ట్ చెక్ ద్వారా వెల్లడించింది. ఈ మేరకు పీఐబీ ట్వీట్ చేసింది. ప్రజలు ఇలాంటి వార్తలను చూసి నమ్మవద్దని సూచించింది. ఇలాంటి నిరాధారమైన, తప్పుడు వార్తలను చదివి నమ్మి మోసపోవద్దని హెచ్చరించింది.
కాగా ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు పెరిగిపోయాయి. కొందరు పనిగట్టుకుని మరీ ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ శాఖలకు చెందిన అధికార యంత్రాంగం ఫేక్ వార్తలపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తోంది. అలాగే మీడియా సంస్థలు కూడా ఇందులో పాలు పంచుకుంటున్నాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…