కరోనా ఏమోగానీ సోషల్ మీడియాలో లెక్కలేనన్ని ఫేక్ వార్తలు రోజూ విపరీతంగా ప్రచారం అవుతున్నాయి. అసలు సోషల్ ప్లాట్ఫాంలలో వస్తున్న వార్తలను నమ్మాలో, లేదో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతోంది. కోవిడ్ బాధితులు నల్ల మిరియాలు, అల్లం, తేనెలను తీసుకుంటే కరోనా త్వరగా తగ్గుతుందని ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది.
అయితే సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఆ వార్తలో ఎంత మాత్రం నిజంలేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) తన ఫ్యాక్ట్ చెక్ ద్వారా వెల్లడించింది. ఈ మేరకు పీఐబీ ట్వీట్ చేసింది. ప్రజలు ఇలాంటి వార్తలను చూసి నమ్మవద్దని సూచించింది. ఇలాంటి నిరాధారమైన, తప్పుడు వార్తలను చదివి నమ్మి మోసపోవద్దని హెచ్చరించింది.
కాగా ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు పెరిగిపోయాయి. కొందరు పనిగట్టుకుని మరీ ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ శాఖలకు చెందిన అధికార యంత్రాంగం ఫేక్ వార్తలపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తోంది. అలాగే మీడియా సంస్థలు కూడా ఇందులో పాలు పంచుకుంటున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…