Vijay Deverakonda : టాలీవుడ్ మోస్ట్ క్రేజీ జంటలలో విజయ్ దేవరకొండ- రష్మిక జంట ఒకటి. విజయ్ దేరవకొండ, రష్మిక ప్రేమలో ఉన్నారంటూ గత కొన్నాళ్లుగా వార్తలు వస్తునే ఉన్నప్పటికీ దీనిపై ఎలాంటి క్లారిటీ రావడం లేదు. రష్మిక, రక్షిత్ శెట్టి ప్రేమించుకోగా, కొద్ది రోజులకి వీరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఇంతలో ఏం అయిందో తెలియదు.. వీళ్ల పెళ్లి బ్రేక్ అయింది. అయితే అప్పుడే రష్మిక తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి గీత గోవిందం సినిమా చేసింది. ఈ సమయంలో రష్మిక విజయ్ దేవరకొండ చాలా క్లోజ్ అయ్యారని, పెళ్లి కూడా చేసుకోవాలని భావించారని ప్రచారం నడిచింది.
రష్మిక, విజయ్ కలిసే ఉంటున్నారని వారు వెకేషన్స్కి కూడా కలిసే వెళుతున్నట్టు ప్రచారం నడుస్తుంది. వీరు వేరు వేరుగా ఫోటోలు దిగిన… ఒకే లోకేషన్ లో దిగుతున్నారు. దీనితో ఇది చూసిన నెటిజన్స్… వీరు ప్రేమలో ఉన్నారని.. కలిసి ఉంటున్నారని కామెంట్స్ చేస్తూ.. ఫ్రూవ్స్ సహా ఫోటోలను నెట్టింట్లో తెగ వైరల్ చేస్తున్నరు. ఈ ఇద్దరి ఏముందో ఏమో తెలియదు కాని తాజాగా విజయ్ దేవరకొండ.. రష్మికకి ఫుల్ సపోర్ట్ అందించారు. జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో దీనిపై పలువువరు ఆగ్రహం వ్యక్తం చేసారు. అమితాబ్ బచ్చన్ మొదలుకుని నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్, మృణాల్ ఠాకూర్ ఇలా టాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా రష్మికకు మద్దతుగా నిలిచారు.
ఈ క్రమంలోనే రష్మిక ఫేక్ వీడియోపై టాలీవుడ్ స్టార్ నటుడు విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ”భవిష్యత్తు కోసం చాలా ముఖ్యమైన అడుగు ఇది అని చెప్పిన విజయ్… ఇలాంటి నిర్ణయమే ఇప్పుడు తీసుకోవాలి.. మరోసారి ఇంకొకరికి ఇలాంటి ఘటన జరగకూడదు అని భావిస్తున్నాను.. డీప్ఫేక్ వీడియో చేసే వారి మీద వెంటనే చర్యలు తీసుకునేందుకు ఓ విభాగాన్ని ఏర్పాటు చేయాలని, వారిని వెంటనే శిక్షించాలని విజయ్ దేవరకొండ డిమాండ్ చేశారు. అలా చేసినప్పుడే మహిళలు రక్షించబడతారు అని విజయ్ తన పోస్ట్లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…