Vijay Deverakonda : టాలీవుడ్ మోస్ట్ క్రేజీ జంటలలో విజయ్ దేవరకొండ- రష్మిక జంట ఒకటి. విజయ్ దేరవకొండ, రష్మిక ప్రేమలో ఉన్నారంటూ గత కొన్నాళ్లుగా వార్తలు వస్తునే ఉన్నప్పటికీ దీనిపై ఎలాంటి క్లారిటీ రావడం లేదు. రష్మిక, రక్షిత్ శెట్టి ప్రేమించుకోగా, కొద్ది రోజులకి వీరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఇంతలో ఏం అయిందో తెలియదు.. వీళ్ల పెళ్లి బ్రేక్ అయింది. అయితే అప్పుడే రష్మిక తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి గీత గోవిందం సినిమా చేసింది. ఈ సమయంలో రష్మిక విజయ్ దేవరకొండ చాలా క్లోజ్ అయ్యారని, పెళ్లి కూడా చేసుకోవాలని భావించారని ప్రచారం నడిచింది.
రష్మిక, విజయ్ కలిసే ఉంటున్నారని వారు వెకేషన్స్కి కూడా కలిసే వెళుతున్నట్టు ప్రచారం నడుస్తుంది. వీరు వేరు వేరుగా ఫోటోలు దిగిన… ఒకే లోకేషన్ లో దిగుతున్నారు. దీనితో ఇది చూసిన నెటిజన్స్… వీరు ప్రేమలో ఉన్నారని.. కలిసి ఉంటున్నారని కామెంట్స్ చేస్తూ.. ఫ్రూవ్స్ సహా ఫోటోలను నెట్టింట్లో తెగ వైరల్ చేస్తున్నరు. ఈ ఇద్దరి ఏముందో ఏమో తెలియదు కాని తాజాగా విజయ్ దేవరకొండ.. రష్మికకి ఫుల్ సపోర్ట్ అందించారు. జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో దీనిపై పలువువరు ఆగ్రహం వ్యక్తం చేసారు. అమితాబ్ బచ్చన్ మొదలుకుని నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్, మృణాల్ ఠాకూర్ ఇలా టాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా రష్మికకు మద్దతుగా నిలిచారు.
ఈ క్రమంలోనే రష్మిక ఫేక్ వీడియోపై టాలీవుడ్ స్టార్ నటుడు విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ”భవిష్యత్తు కోసం చాలా ముఖ్యమైన అడుగు ఇది అని చెప్పిన విజయ్… ఇలాంటి నిర్ణయమే ఇప్పుడు తీసుకోవాలి.. మరోసారి ఇంకొకరికి ఇలాంటి ఘటన జరగకూడదు అని భావిస్తున్నాను.. డీప్ఫేక్ వీడియో చేసే వారి మీద వెంటనే చర్యలు తీసుకునేందుకు ఓ విభాగాన్ని ఏర్పాటు చేయాలని, వారిని వెంటనే శిక్షించాలని విజయ్ దేవరకొండ డిమాండ్ చేశారు. అలా చేసినప్పుడే మహిళలు రక్షించబడతారు అని విజయ్ తన పోస్ట్లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…