Vijay And Mahesh Babu : ఇటీవల కాలంలో సౌత్ సినిమాల స్థాయి పెరగింది. బాలీవుడ్తో పోటీ పడి సినిమాలు చేస్తున్నారు. ఇక భాష తో సంబంధం లేకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు మంచి గుర్తింపు పొందుతున్నారు. ముఖ్యంగా తెలుగు హీరోలకు అయితే దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ అయితే ఏర్పడుతోంది. ఇక తమిళ హీరోలు ముందుగానే టాలీవుడ్ లో వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నారు. అయితే కొందరు హీరోలు కొన్ని సినిమాలలో కలిసి నటిస్తే ప్రేక్షకులకి ఎక్కడలేని ఆనందం దక్కడం ఖాయం. అది జరిగితే బాగుండు అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. సౌత్లో స్టార్స్గా ఓ వెలుగు వెలుగుతున్న మహేష్,విజయ్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది.
ఈ ఇద్దరు కలిసి నటించాల్సిన సినిమా జస్ట్లో మిస్ అయింది. ఆ సినిమా ఏంటంటే పొన్నియిన్ సెల్వన్. మహేష్, విజయ్ లను తన సినిమాలో నటింపజేసేందుకు మణిరత్నం ఎంతగానో ప్రయత్నించాడట. వందియాదవన్, అరుణ్మొళి వర్మన్ పాత్రల కోసం మణిరత్నం ఈ ఇద్దరు స్టార్ హీరోలను మొదట అనుకున్నాడట. అయితే అరుణ్మొళి వర్మన్ పాత్ర కోసం మహేష్ బాబును, వల్లవరైయన్ వందియాదవన్ పాత్రకు దళపతి విజయ్ బాగుందటుందని భావించి వారిని కలిసి విషయం చెప్పగా వారు నో చెప్పారట. ఇతర సినిమాలకి కమిట్ కావడం, వేరే కారణాల వలన వారు నో చెప్పడంతో ఈ పాత్రలను కార్తీ, జయం రవిలతో చేయించాల్సి వచ్చింది. పొన్నియిన్ సెల్వన్ మూవీలో అరుణ్మొళి వర్మన్ (రాజ రాజ చోళ) పాత్రను జయం రవి, వందియాదవన్ పాత్రను కార్తీ పోషించారు.
ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా రచయిత జయమోహన్ వెల్లడించడం విశేషం.కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మెల్లగా తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా తన స్థాయిని పెంచుకునే విధంగా అడుగులు వేస్తూ ఉన్నాడు. ఇంతకుముందు అతను నటించిన మాస్టర్ సినిమా తెలుగులో ఎలాంటి కలెక్షన్స్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పది కోట్ల మార్కెట్ ఏర్పడడంతో ఆ మధ్య వచ్చిన సినిమాకు కూడా మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. మరోవైపు మహేష్ బాబు పాన్ ఇండియా స్టార్గా సత్తా చాటేందుకు కృషి చేస్తున్నాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…