Vijay And Mahesh Babu : ఇటీవల కాలంలో సౌత్ సినిమాల స్థాయి పెరగింది. బాలీవుడ్తో పోటీ పడి సినిమాలు చేస్తున్నారు. ఇక భాష తో సంబంధం లేకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు మంచి గుర్తింపు పొందుతున్నారు. ముఖ్యంగా తెలుగు హీరోలకు అయితే దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ అయితే ఏర్పడుతోంది. ఇక తమిళ హీరోలు ముందుగానే టాలీవుడ్ లో వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నారు. అయితే కొందరు హీరోలు కొన్ని సినిమాలలో కలిసి నటిస్తే ప్రేక్షకులకి ఎక్కడలేని ఆనందం దక్కడం ఖాయం. అది జరిగితే బాగుండు అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. సౌత్లో స్టార్స్గా ఓ వెలుగు వెలుగుతున్న మహేష్,విజయ్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది.
ఈ ఇద్దరు కలిసి నటించాల్సిన సినిమా జస్ట్లో మిస్ అయింది. ఆ సినిమా ఏంటంటే పొన్నియిన్ సెల్వన్. మహేష్, విజయ్ లను తన సినిమాలో నటింపజేసేందుకు మణిరత్నం ఎంతగానో ప్రయత్నించాడట. వందియాదవన్, అరుణ్మొళి వర్మన్ పాత్రల కోసం మణిరత్నం ఈ ఇద్దరు స్టార్ హీరోలను మొదట అనుకున్నాడట. అయితే అరుణ్మొళి వర్మన్ పాత్ర కోసం మహేష్ బాబును, వల్లవరైయన్ వందియాదవన్ పాత్రకు దళపతి విజయ్ బాగుందటుందని భావించి వారిని కలిసి విషయం చెప్పగా వారు నో చెప్పారట. ఇతర సినిమాలకి కమిట్ కావడం, వేరే కారణాల వలన వారు నో చెప్పడంతో ఈ పాత్రలను కార్తీ, జయం రవిలతో చేయించాల్సి వచ్చింది. పొన్నియిన్ సెల్వన్ మూవీలో అరుణ్మొళి వర్మన్ (రాజ రాజ చోళ) పాత్రను జయం రవి, వందియాదవన్ పాత్రను కార్తీ పోషించారు.
ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా రచయిత జయమోహన్ వెల్లడించడం విశేషం.కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మెల్లగా తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా తన స్థాయిని పెంచుకునే విధంగా అడుగులు వేస్తూ ఉన్నాడు. ఇంతకుముందు అతను నటించిన మాస్టర్ సినిమా తెలుగులో ఎలాంటి కలెక్షన్స్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పది కోట్ల మార్కెట్ ఏర్పడడంతో ఆ మధ్య వచ్చిన సినిమాకు కూడా మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. మరోవైపు మహేష్ బాబు పాన్ ఇండియా స్టార్గా సత్తా చాటేందుకు కృషి చేస్తున్నాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…